National news : రూ.2 వేల కోసం గొడవ.. అల్లుణ్ని చావబాదారు
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో రూ.2,000 కోసం గొడవపడి.. పుట్టింటివారితో కలిసి అతడిపై తీవ్రంగా దాడి చేసింది ఓ మహిళ. బిహార్లోని సీతామఢీ జిల్లా షాబాజ్పుర్లో మంగళవారం ఈ ఘటన జరిగింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో రూ.2,000 కోసం గొడవపడి.. పుట్టింటివారితో కలిసి అతడిపై తీవ్రంగా దాడి చేసింది ఓ మహిళ. బిహార్లోని సీతామఢీ జిల్లా షాబాజ్పుర్లో మంగళవారం ఈ ఘటన జరిగింది. తన ముఖంపై యాసిడ్ పోశారని, కళ్లు కనిపించడం లేదని అతడు చెబుతున్నాడు. బైరహా గ్రామానికి చెందిన నాగేశ్వర్సింగ్, షాబాజ్పుర్కు చెందిన పార్వతీ కుమారి పదేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. రూ.2 వేల కోసం పదిహేను రోజుల క్రితం వీరి మధ్య గొడవ జరిగింది. కోపంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత భర్తకు ఫోను చేసి తన పుట్టింటికి రావాలని కోరింది. తప్పు తెలుసుకొంది కాబోలు అని నాగేశ్వర్ వెళ్లగా.. అక్కడ గొడవ పెద్దదైంది. అత్తింటివారంతా కలిసి నాగేశ్వర్ను చావబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుణ్ని హుటాహుటిన సీతామఢీ ఆస్పత్రికి తరలించారు. తన కళ్లలో యాసిడ్ పోశారని నాగేశ్వర్ చెబుతున్నా.. అలాంటి ఆనవాళ్లు లేవని చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం