pak and turkey: పాక్ పెద్దన్న కూడా గ్రేలిస్ట్లోకి..!
పాకిస్థాన్కు ప్రతి విషయంలో వంతపాడి పెద్దన్నగా వ్యవహరించినందుకు టర్కీ ఫలితం అనుభవిస్తోంది. ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చుకొన్న టర్కీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో
టర్కీపై కొరడా ఝుళిపించిన ఎఫ్ఏటీఎఫ్
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
పాకిస్థాన్కు ప్రతి విషయంలో వంతపాడి పెద్దన్నగా వ్యవహరించినందుకు టర్కీ ఫలితం అనుభవిస్తోంది. ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చుకొన్న టర్కీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సరికొత్త ఒట్టమాన్ సామ్రాజ్యం స్థాపించాలనుకున్న ఎర్డగాన్ ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో భవిష్యత్తులో నిధుల కోసం కటకటలాడనుంది. ఇక ఎఫ్ఏటీఎఫ్ (ఆర్థిక కార్యదళం) నుంచి బయటపడదామన్న పాక్ ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు.
ఆర్థిక కార్యదళం గురువారం కీలక నిర్ణయం తీసుకొంది. టర్కీని గ్రేలిస్ట్లోకి చేర్చింది. మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం వంటి పనులు చేస్తున్నందుకు శిక్షగా ఈ నిర్ణయం తీసుకొంది. దీంతో కొన్నేళ్లపాటు టర్కీలోకి పెట్టుబడులు వచ్చే అవకాశం తగ్గిపోయింది. టర్కీతోపాటు మాలీ, జోర్డాన్ను కూడా ఈ జాబితాలోకి చేర్చింది. పాక్ ఈ జాబితాలోనే కొనసాగుతోంది. బోట్సువానా, మారిషస్లను ఈ జాబితా బయటకు తెచ్చింది.
టర్కీ బ్యాంకింగ్ వ్యవస్థ, రియల్ ఎస్టేట్, బంగారం, రత్నాల డీలర్లు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారని ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్షుడు మార్కస్ ప్లియర్ పేర్కొన్నారు. అంతేకాదు మనీలాండరింగ్, ఐఎస్ఐఎల్, అల్ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం వంటి వాటిపై విచారణ జరిపి అడ్డుకోవాలన్నారు.
2019లో తీరుమార్చుకోమని ఎఫ్ఏటీఎఫ్ ఓ సారి టర్కీని హెచ్చరించింది. ఉగ్ర సంస్థల ఆస్తులు, నిధులను స్తంభింపజేయాలని సూచించింది. కానీ, ఎర్డగాన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
ఎర్డగాన్ చర్యలతో పతనమైన లీరా..
ఓ పక్క ఎఫ్ఏటీఎఫ్ టర్కీని గ్రే లిస్ట్లో చేర్చడం, మరోపక్క ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించడం కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపింది. ఆ దేశ కరెన్సీ లీరా విలువ భారీగా పతనమైంది. ఇప్పటికే డాలర్తో పోలిస్తే గత ఐదేళ్లలో లీరా 30 శాతానికి పైగా పతనం అయింది. తాజాగా ఈ కరెన్సీ మరో 2శాతం విలువ కోల్పోయింది. టర్కీ అధ్యక్షుడు సంప్రదాయక ఆర్థిక విధానాలను అనుసరించాలని ఒత్తిడి తేవడంతో వడ్డీరేట్లను తగ్గించారు. ఓ పక్క ద్రవ్యోల్బణం పెరుగుతున్నా.. టర్కీ ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని గణనీయంగా పెంచేందుకు ఎర్డగాన్ చేస్తున్న ప్రయత్నాలు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి. గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి ద్రవ్యోల్బణం చేరిందని ఇటీవల ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. అక్టోబర్ మొదటి వారంలో విడుదలైన గణాంకాల ప్రకారం వినిమయ ధరల సూచీ 19.58శాతం పెరిగింది. ఆ దేశ కేంద్ర బ్యాంకు విధించిన ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని దాటేసి నాలుగు రెట్లు పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్లోకి చేరింది. దీంతో విదేశీ పెట్టుబడులు టర్కీకి వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. టర్కీ మానిటరీ పాలసీలో ఎర్డగాన్ జోక్యం చేసుకోవడాన్ని గమనించిన విదేశీ పెట్టుబడిదారులు ఆదేశాన్ని వీడుతున్నారు.
సులేమానీ బ్రిగేడ్ విషయం బయటకొచ్చిన ఏడాదిలోపే..
సిరియా నుంచి కిరాయి ఉగ్రమూకను కశ్మీర్లోకి తరలించాలని కుట్రలు పన్నుతున్న విషయాన్ని గతేడాది గ్రీకు జర్నలిస్టు ఆండ్రెస్ మౌంటుజోర్లియస్ వెలుగులోకి తెచ్చాడు. ‘పెంటపోస్టగ్మా’ అనే గ్రీకు పత్రిక దీనిపై విస్తృత కథనాన్ని ప్రచురించింది. దక్షిణాసియాలో పరపతి పెంచుకొని సౌదీ అరేబియాను సవాల్ చేయాలన్న వ్యూహంలో భాగంగా టర్కీ ఈ కుట్ర పన్నిందని పేర్కొంది. ఇందుకు కశ్మీర్ను పావుగా వాడుకోవడానికి సిద్ధమవుతోంది. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచే పనిని సులేమానీ షా బ్రిగేడ్కు అప్పగించినట్లు అప్పట్లో ఆ పత్రిక పేర్కొంది. ఈ బ్రిగేడ్ సిరియన్ నేషనల్ ఆర్మీలో పనిచేసిందని వెల్లడించింది. దీని నాయకుడు అబూ ఎమ్సా తన బృంద సభ్యులతో సమావేశమై కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచాలనే టర్కీ లక్ష్యాన్ని వెల్లడించినట్లు ఈ కథనం పేర్కొంది. కిరాయి బృందంలో ఒక్కోరికి 2వేల డాలర్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వివరించింది.
పాక్ నుంచి ప్రవహిస్తున్న ఉగ్ర నిధులు..
ఈ సారి ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్ నుంచి బయటపడాలని పాక్ తీవ్రంగానే ప్రయత్నించింది. ఈ సంస్థ అప్పగించిన 27 పాయింట్ల ప్రణాళికలో 26 అమలు చేసినట్లు పాక్ చెప్పుకొంది. కానీ, ఎఫ్ఏటీఎఫ్ దానిని నమ్మలేదు. పాక్ నుంచి ఇంకా ఉగ్రవాదులకు నిధులు చేరుతున్నాయని పేర్కొంది. దీంతోపాటు ఐరాస ఉగ్రజాబితాలోని వారిపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ఇక పాక్, టర్కీలు కశ్మీర్ విషయంలో ఒకే వాదన వినిపిస్తున్నాయి. కశ్మీర్ నుంచి వెళ్లేవారు ఐఎస్ఐతో భేటీ అయ్యేందుకు టర్కీ ఒక వేదిక వలే వ్యవహరిస్తోంది. ఇటీవల కూడా ఐరాసలో టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.