శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

దిల్లీ-దెహ్రాదూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సీ-4 బోగీలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి సీ-4 బోగీ పూర్తిగా దగ్ధం అయింది...

Updated : 13 Mar 2021 22:13 IST

దెహ్రాదూన్‌: దిల్లీ-దెహ్రాదూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సీ-4 బోగీలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి సీ-4 బోగీ పూర్తిగా దగ్ధం అయింది. సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే మంటలు ఆర్పివేశారు. హరిద్వార్‌లోని రాజాజీ పులుల సంరక్షణ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. మంటల్లో కాలిపోతున్న బోగీని ఇంజిన్‌ నుంచి వేరు చేశారు. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని ఉత్తరాఖండ్‌ డీజీపీ వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని