స్థానికుల డేరింగ్ ఆపరేషన్.. 35 మందిని కాపాడి..!
దిల్లీ(Delhi)లో ఓ భవనంలో మంటలు చెలరేగగా.. తమ ప్రాణాలు లెక్కచేయకుండా స్థానికులు సహాయకచర్యల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దిల్లీ: ఒక భవనంలో మంటలు చెలరేగడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫైరింజన్లకు సమాచారం అందినప్పటికీ.. ఇరుకైన దారుల్లో వెళ్లడానికి వీలుకాలేదు. అదే సమయంలో స్థానికులు రంగంలోకి దిగి, 35 మందిని కాపాడేందుకు సహకరించారు. వారు కాపాడిన వారిలో నాలుగేళ్ల చిన్నారి కూడా ఉంది. (fire accident)
దిల్లీ(Delhi)లోని ముఖర్జీ నగర్లోని మహిళల వసతి గృహంలో గురువారం మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ మీటర్లు ఉన్న ప్రాంతం నుంచి ఆ మంటలు వచ్చాయి. అక్కడ పాత ఫర్నీచర్, ఇతర సామాన్లు ఉన్నాయని దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమికంగా వెల్లడించింది. అక్కడ మొదలైన మంటలు.. తర్వాత ఎగువ అంతస్తులకు ఎగబాకాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ.. 20 ఫైరింజన్లను పంపింది. కానీ ట్రాఫిక్ అంతరాయాల వల్ల ఎనిమిది మాత్రమే అక్కడకు చేరుకున్నాయి.
మణిపుర్లో మళ్లీ కల్లోలం.. పుల్వామా దర్యాప్తు ఐపీఎస్ అధికారికి పిలుపు..
ఈ పరిస్థితిని గమనించిన స్థానికులు తక్షణమే స్పందించారు. లోపల ఉన్నవారిని కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. ఆన్లైన్లో వైరల్గా మారిన ఘటన దృశ్యాల్లో.. కొందరు వ్యక్తులు కలిసి లోపలివైపు నుంచి తాళం వేసి ఉన్న భవనం గేట్లు తెరవడం కనిపించింది. అన్నిమాపక సిబ్బందితో కలిసి వారు కూడా వసతి గృహంలోని మహిళలను కాపాడారు. మంటలు ఎగిసిపడుతున్నా.. భవనమంతా దట్టమైన పొగ అలుముకున్నా వారు డేరింగ్గా ముందుకెళ్లారు. దాంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ ఘటన నుంచి 35 మంది సురక్షితంగా బయటపడ్డారు.
ముఖర్జీ నగర్.. దిల్లీ యూనివర్సిటీకి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ పేయింగ్ గెస్ట్ హాస్టల్స్, కోచింగ్ సెంటర్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రస్తుతం వసతిగృహం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
CBSE: 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కుల డివిజన్ ప్రకటించం: బోర్డు
10, 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో మార్కులకు సంబంధించి ఎటువంటి డివిజన్లు/డిస్టింక్షన్ (Distinction) తాము కేటాయించమని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్పష్టం చేసింది. -
Bomb threat: బెంగళూరులో 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
బెంగళూరు (Bengaluru)లో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రెండు విడతలుగా ఈ బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. -
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా
సరిహద్దులు సురక్షితంగా లేకపోతే దేశం అభివృద్ధి చెందదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. -
ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు..
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఏడాది క్రితం చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని జీవిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. -
శ్రీనగర్ నిట్లో సోషల్ మీడియా దుమారం
జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ ఎన్ఐటీలో మతపరమైన అంశంపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుకు నిరసనగా కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. -
పల్లెటూరి మేడం యూట్యూబ్ ఆంగ్ల పాఠాలు అదుర్స్
ఉత్తర్ప్రదేశ్లోని కౌశాంబీ జిల్లా సిరాథూ నగర పంచాయతీకి చెందిన యశోద అనే గ్రామీణ యువతి ఆంగ్ల బోధనకు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి విశేష ఆదరణ చూరగొంటోంది. -
Gated community: గేటెడ్ కమ్యూనిటీ రోడ్లపై ఎవరైనా వెళ్లవచ్చు!
గేటెడ్ కమ్యూనిటీల్లోని రహదారులపై బయటి వారు కూడా రాకపోకలు సాగించవచ్చని కర్ణాటక ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. -
సిల్క్యారాలోనా.. సొంత ఊళ్లకా!
మృత్యువు అంచువరకు వెళ్లి రెండ్రోజుల క్రితం క్షేమంగా తిరిగివచ్చిన సిల్క్యారా సొరంగ కార్మికులు ఇప్పుడు అక్కడే ఉండి ఎప్పటిలా పనిచేసుకోవాలా, సొంత ఊళ్లకు వెళ్లిపోవాలా అనే ఊగిసలాటలో ఉన్నారు. -
నా దృష్టిలో పెద్దకులాలు ఆ నాలుగే
‘నా దృష్టిలో నాలుగు పెద్ద కులాలవారంటే పేదలు, యువత, మహిళలు, రైతులు. వారి ఎదుగుదలతోనే దేశం అభివృద్ధి చెందుతుంది’ అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
ఒడిశా అడవుల్లో బ్లాక్ పాంథర్
ఒడిశా అడవుల్లో బ్లాక్ పాంథర్(నల్ల చిరుత) కనిపించింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) సుశాంత నందొ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వివరాలు వెల్లడించారు. -
కన్నూర్ వర్సిటీ వీసీగా రవీంద్రన్ పునర్నియామకం కొట్టివేత
కేరళలోని కన్నూర్ యూనివర్సిటీ ఉప కులపతి (వైస్ఛాన్సలర్/వీసీ)గా గోపీనాథ్ రవీంద్రన్ పునర్నియామకాన్ని సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. -
విమానంలో నీటి ధార
విమానంలో క్యాబిన్ పైకప్పు నుంచి ఏర్పడిన నీటి లీకేజీతో ప్రయాణికులు ఇబ్బంది పడిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. -
శోమాకాంతి సేన్ బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించిన ఎన్ఐఏ
ఎల్గార్ పరిషద్ - మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు శోమాకాంతి సేన్ ఆరోగ్య కారణాలతో సుప్రీంకోర్టులో పెట్టుకున్న మధ్యంతర బెయిల్ అభ్యర్థన పిటిషన్ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గట్టిగా గురువారం వ్యతిరేకించింది. -
నాడు భారత్ను ద్వేషించి.. నేడు ప్రేమించి..!
అమెరికా భద్రతా సలహదారుడిగా, విదేశాంగ మంత్రిగా హెన్రీ కిసింజర్ 70వ దశకంలో తీవ్ర భారత్ వ్యతిరేకవైఖరిని అవలంబించారు. పాకిస్థాన్తో మాత్రం సత్సంబంధాలు కొనసాగించారు. -
కుర్చీ పట్టుకోమ్మా.. లేదా ఆమె కూర్చుంటుంది: మోదీ
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎక్కువమందికి చేర్చడానికి ఉద్దేశించిన ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’లో భాగంగా వివిధ స్కీంల లబ్ధిదారులను ఉద్దేశించి గురువారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. -
సాధ్యమైనంత త్వరగా తదుపరి విడత సైనిక చర్చలు
తూర్పు లద్దాఖ్లో బలగాల ఉపసంహరణను పూర్తిచేయడంతోపాటు అపరిష్కృతంగా ఉన్న పలు అంశాలపై భారత్, చైనాలు గురువారం దౌత్యపరమైన చర్చలు జరిపాయి. -
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ రేపు
ఈ నెల 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శనివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. -
జ్ఞానవాపి సర్వే నివేదిక సమర్పణకు 10 రోజుల గడువు
ఉత్తర్ప్రదేశ్లోని కాశీలో జ్ఞానవాపి మసీదు ఆవరణలో భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ) నిర్వహించిన సర్వే నివేదిక తయారీ, సమర్పణకు వారణాసి జిల్లా కోర్టు మరో 10 రోజుల గడువిచ్చింది. -
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 21 లక్షల మంది బలి
ఆరుబయట చోటుచేసుకుంటున్న వాయు కాలుష్యం వల్ల భారత్లో ఏటా 21.8 లక్షల మంది బలవుతున్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
న్యాయాధికారులకు గౌరవప్రదమైన సౌకర్యాలు
న్యాయాధికారులకు గౌరవప్రదమైన సౌకర్యాలు, పని వాతావరణం ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు గురువారం స్పష్టంచేసింది. -
లోక్సభ సెక్రటరీ జనరల్ పదవీ కాలం పొడిగింపు
లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


తాజా వార్తలు (Latest News)
-
CM Kcr: ఎగ్జిట్ పోల్స్తో పరేషాన్ కావొద్దు.. మళ్లీ భారాసదే విజయం: సీఎం కేసీఆర్
-
Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 20,250 ఎగువన రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
-
Biden: పన్నూ హత్యకు కుట్ర..భారత్కు ఏకంగా సీఐఏ చీఫ్ను పంపిన బైడెన్!
-
కాంగ్రెస్కు అచ్చేదిన్.. ఇది కూటమి విజయం: ఎగ్జిట్ పోల్స్పై సంజయ్ రౌత్
-
KRMB: సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి: ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ
-
LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్పై రూ.21 పెంపు