యూకే నుంచి భారత్‌కు చేరిన వైద్య సామగ్రి సాయం

కరోనా ఉద్ధృతితో ఆపత్కాలంలో ఉన్న భారత్‌కు సాయం చేస్తున్న యూకే మంచితనాన్ని అభినందిస్తున్నామని భారత విదేశాంగశాఖ వెల్లడిచింది. భారత్‌కు తక్షణ సాయంగా బ్రిటన్‌ ప్రభుత్వం పంపిన వైద్య సామగ్రి మంగళవారం ఉదయం అందిందని తెలిపింది.

Updated : 27 Apr 2021 11:03 IST

దిల్లీ: కరోనా ఉద్ధృతితో ఆపత్కాలంలో ఉన్న తమ దేశానికి సాయం చేస్తున్న యూకే మంచితనాన్ని అభినందిస్తున్నామని భారత విదేశాంగశాఖ వెల్లడిచింది. భారత్‌కు తక్షణ సాయంగా బ్రిటన్‌ ప్రభుత్వం పంపిన వైద్య సామగ్రి మంగళవారం ఉదయం అందిందని తెలిపింది. ఈ మేరకు విదేశాంగ ప్రతినిధి అరిందమ్‌ బాచీ ట్విటర్‌ వేదికగా తెలిపారు. ‘అంతర్జాతీయ సహకారం కార్యరూపం దాల్చింది. ఆపత్కాలంలో భారత్‌కు సహకారం అందిస్తున్న బ్రిటన్‌కు అభినందనలు. వంద వెంటిలేటర్లు, 95 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు భారత్‌కు చేరుకున్నాయి’ అని బాగ్చీ ట్వీట్‌లో పేర్కొన్నారు. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ ద్వారా వైద్య సామగ్రి భారత్‌కు చేరిన ఫొటోలను ఆయన ట్వీట్‌లో పంచుకున్నారు.

భారత్‌లో కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తున్న వేళ పలు దేశాలు తమ సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా బ్రిటన్‌ కూడా భారత్‌కు సహకారం అందిస్తామని ప్రకటించింది. దిల్లీలోని బ్రిటిష్‌ హైకమిషన్‌ స్పందిస్తూ.. ఈ వారంలో 495 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 120 నాన్‌ ఇన్వేసివ్‌ వెంటిలేటర్లు, 20 మ్యానువల్‌ వెంటిలేటర్లు బ్రిటన్‌ నుంచి పంపనున్నట్లు తెలిపింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని