సీడీఎస్ మరణం తర్వాతతొలిసారి సమావేశం కానున్న ఆర్మీ కమాండర్లు
చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత తొలి సారిగా ఆర్మీ కమాండర్లు ఈనెల 23, 24న దిల్లీలో సమావేశం కానున్నారని...
దిల్లీ: చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణించిన తర్వాత తొలి సారిగా ఆర్మీ కమాండర్లు ఈనెల 23, 24న దిల్లీలో సమావేశం కానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన భద్రతా విషయాలపై చర్చించనున్నారని తెలిపాయి. దేశంలోని అత్యంత సీనియర్ సైనికాధికారి, ఆయన భార్య మధులికారావత్ సహా మరో 12 మంది సైనికాధికారులు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విపత్కర పరిస్థితుల తర్వాత సమావేశం జరగనుంది.
సమావేశంలో అందరు ఆర్మీ కమాండర్లు చైనా, పాకిస్థాన్ సహా దేశ సరిహద్దుల వెంబడి ప్రస్తుత భద్రతా పరిస్థితులపై చర్చించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. తీవ్రమైన చలి నేపథ్యంలోనూ చైనా సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి అధిక సంఖ్యలో సైనికులను మోహరించి పర్యవేక్షిస్తున్న భద్రతా చర్యలపై ఆర్మీ కమాండర్లకు వివరించనున్నట్లు వెల్లడించారు. ఆర్మీలో కొనసాగుతున్న సంస్కరణలపై కూడా కమాండర్లతో చర్చించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సీడీఎస్ మరణం నేపథ్యంలో తదుపరి సీడీఎస్ నియామకంపైనా ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా