Double Maskతో మరింత మేలు!
కరోనాకు బ్రేకులు వేయాలంటే ఒక్క మాస్క్ పెట్టుకుంటే సరిపోదా? ప్రతిఒక్కరూ రెండు మాస్క్లు ధరించాల్సిందేనా? కొవిడ్ కట్టడికి కఠిన ఆంక్షలు అమలు....
తాజా అధ్యయనం ఏం చెబుతోందంటే..
ఇంటర్నెట్ డెస్క్: కరోనా స్పీడుకు బ్రేకులు వేయాలంటే ఒక్క మాస్క్ పెట్టుకుంటే సరిపోదా? ప్రతి ఒక్కరూ రెండు మాస్క్లు ధరించాల్సిందేనా? కొవిడ్ కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ ఈ జిత్తులమారి వైరస్ మరింత ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్నవేళ కొత్త అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. మాస్క్ ధరించడంపై యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా హెల్త్ కేర్ జరిపిన కొత్త అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. కొవిడ్కు కళ్లెం వేయాలంటే ఒక్క మాస్క్ చాలదని, డబుల్ మాస్క్ ధరించడం వల్లే వైరస్ దరిచేరకుండా ఉంటుందని నిర్ధారణ అయినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాస్క్లను పలు రకాలుగా పరీక్షించి జరిపిన ఈ అధ్యయన ఫలితాలు JAMA ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
డబుల్ మాస్క్ ధరించడం వల్ల వైరస్ కణాలు ముక్కు, నోటి ద్వారా ప్రవేశించలేవని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. మాస్క్లలో పొరల సంఖ్య పెరగడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, వాటిలో ఉన్న ఖాళీలు సరిగా పూడ్చినట్టుగా ఉండి ముఖానికి బిగువుగా ఉంటేనే వైరస్ ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతామని పేర్కొంది. వడపోత సామర్థ్యం కలిగిన పదార్థాలతో మెడికల్ ప్రొసీజర్ మాస్క్లు తయారైనప్పటికీ అవి మన ముఖాలకు సరిగా సరిపోవని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన యూఎన్సీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అంటువ్యాధుల అసోసియేట్ ప్రొఫెసర్ ఎమ్లీ సిక్బెర్ట్ బెన్నెట్ తెలిపారు.
వస్త్రంతో చేసిన మాస్క్తో సర్జికల్ మాస్క్ను కలిపి వేసుకుంటే ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. మనుషుల ముఖాల్లో తేడాలను బట్టి ఈ మాస్క్ల సామర్థ్యం భిన్నంగా ఉంటుందని గుర్తించారు. మామూలుగా అయితే, సర్జికల్ మాస్క్లు వైరస్ కణాలను అడ్డుకోవడంలో 40 నుంచి 60శాతం సమర్థతను కలిగి ఉండగా.. వస్త్రంతో తయారు చేసిన మాస్క్లు 40శాతానికి పైగా సమర్థతతో ఉంటాయని తెలిపారు. సర్జికల్ మాస్క్పై వస్త్రం మాస్క్ను ధరించడం వల్ల వైరస్ను నిలువరించే సామర్థ్యం 20శాతం అధికంగా ఉన్నట్టు తాజా అధ్యయనంలో గుర్తించారు. అలాగే, దీనివల్ల మాస్క్లోని ఖాళీలు పూర్తిగా తొలిగి ముఖానికి బిగువుగా ఉంటూ స్థిరంగా ముక్కు, నోటిని కప్పి ఉంచుతున్నట్టుగా నిర్ధారణకు వచ్చారు.
అదే, వస్త్రం మాస్క్పై సర్జికల్ మాస్క్ను పెట్టుకుంటే ఫలితాలు అంత ఆశాజనకంగా లేవు. అలాగే, వదులుగా ఉన్న రెండు మాస్క్లను పెట్టుకోవడం వల్ల ప్రయోజనం కనిపించలేదని, దానికంటే సరిగా అమరిన ఒక మాస్క్ పెట్టుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉన్నట్టు బెన్నెట్ తెలిపారు. కరోనా వైరస్ను నివారించడంలో మాస్క్ ధరించడం ఎంత ప్రభావం చూపిస్తోందో ప్రస్తుత డేటాతో వెల్లడవుతోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!