plane crash: విమానం కుప్పకూలి ఐదుగురి దుర్మరణం

దక్షిణ సుడాన్​ రాజధాని జుబాలో కార్గో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.....

Published : 02 Nov 2021 22:53 IST

జుబా: దక్షిణ సుడాన్​ రాజధాని జుబాలో కార్గో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విమానం ఆప్టిమమ్ ఏవియేషన్ లిమిటెడ్‌కు చెందినదిగా గుర్తించారు. జుబా ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ నుంచి బయలుదేరిన ఈ విమానం టేకాఫ్​ అయిన కొద్దిసేపటికే కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతిచెందిన ఐదుగురిలో పైలెట్​తో పాటు సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. వారిలో ఇద్దరు రష్యాకు చెందిన వారు కాగా.. మిగతావాళ్లు దక్షిణ సుడాన్​కు చెందిన వారని తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని