Viral news: పెళ్లి కోసం..ఏకంగా విమానాన్నే బుక్‌ చేశారు!

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన వధూవరులు కాస్త భిన్నంగా ఆలోచించారు. వారి వివాహానికి వచ్చే అతిథుల కోసం ఏకంగా విమానాన్నే బుక్‌ చేసేశారు.

Published : 04 Dec 2022 01:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జీవితంలో ఒక్కసారే కదా పెళ్లి చేసుకుంటామని అని ఉన్నంతలో కాస్త ఎక్కువగానే ఖర్చు చేస్తుంటారు. స్తోమత ఉన్నవారైతే వివాహం వైవిద్యంగా ఉండాలని విదేశాలకు వెళ్లడమో లేదంటే.. కొత్తగా ఉంటుందని సముద్రంలో షిప్‌పై పెళ్లి చేసుకోవడమో లాంటివి చేస్తుంటారు. మరి కొందరు గాల్లో తేలియాడుతూ పెళ్లి చేసుకుంటారు. కానీ, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన వధూవరులు ఇంకాస్త భిన్నంగా ఆలోచించారు. ఇరువైపుల నుంచి వచ్చే అతిథుల కోసం ఏకంగా విమానాన్నే బుక్‌ చేశారు. అందరూ విమానంలో కూర్చొని కేరింతలు కొడుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను శ్రేయ సాహ్‌ అనే డిజిటల్‌ క్రియేటర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు. మరోవైపు యూజర్లు రకరకాలుగా కామెంట్లు గుప్పిస్తున్నారు. ‘ మీరు ధనవంతులని చెప్పకనే చెప్తున్నారుగా’ అని ఒక యూజర్‌ కామెంట్‌ చేయగా.. ‘మా ఇంట్లో ఇలాంటి వాటిని అంగీకరించరు’ అని మరో యూజర్‌ బదులిచ్చారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు