Flight Fares: భారత్-కెనడాల మధ్య ఉద్రిక్తతలు.. విమాన టికెట్ ధరలకు రెక్కలు
భారత్కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్రం తాత్కాలికంగా నిలిపివేయడంతో ఇరు దేశాల మధ్య విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరిగింది. దీంతో విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
దిల్లీ/టొరంటో: భారత్-కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు తమ ప్రణాళికల్లో మార్పులు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ట్రావెల్ ఏజెన్సీలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో కంటే ప్రస్తుతం భారత్-కెనడాల మధ్య విమాన టికెట్ ధరలు 25 శాతం మేర పెరిగాయని తెలిపాయి. గురువారం భారత్కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్రం తాత్కాలికంగా నిలిపివేయడంతో దిల్లీ నుంచి టొరంటో విమాన టికెట్ బుకింగ్స్కు చివరి నిమిషంలో డిమాండ్ పెరిగిందని వెల్లడించాయి.
భారత్-కెనడాల మధ్య ఎయిర్ ఇండియా, ఎయిర్ కెనడాలు విమాన సర్వీసులను నిర్వహిస్తున్నాయి. వారానికి 48 విమానాలు ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజు దిల్లీ-టొరంటో, దిల్లీ-వాంకోవర్ మధ్య ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. ఇక ఎయిర్ కెనడా దిల్లీ-టొరంటో మధ్య ప్రతి రోజూ విమాన సర్వీసులను నడుపుతోంది. దాంతోపాటు వారంలో మూడు విమాన సర్వీసులను దిల్లీ-మాంట్రియల్ మధ్య నిర్వహిస్తోంది.
ట్రూడోకు షాక్.. పాపులారిటీలో ప్రతిపక్షనేత ముందజ
అంతర్జాతీయ ఎయిర్ ట్రాఫిక్ మార్కెట్లో భారత్-కెనడా వాటా 1.2 శాతం కాగా, కెనడా విమాన రవాణాలో భారత్ నాలుగో అతిపెద్ద దేశం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య 6,78,614 మంది ప్రయాణించారు. తాజాగా ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దిల్లీ-టొరంటో విమాన టికెట్ ధరల గురించి విచారించే వారి సంఖ్య పెరిగిందని ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Gold Saree: బంగారు చీర.. ధర రూ.2.25 లక్షలు
దిల్లీలో జరుగుతున్న 42వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో బంగారు పూత పూసిన ఓ చీర రూ.2.25 లక్షల ధర పలికింది. -
రూ.4.60 లక్షల ధర పలికిన ముర్రాజాతి గేదె
హరియాణాలోని ఝజ్జర్ జిల్లా ఖాన్పుర్కు చెందిన ఓ ముర్రాజాతి గేదె రికార్డుస్థాయిలో రూ.4.60 లక్షలకు అమ్ముడుపోయింది. -
రన్వేపై బారాత్.. విమానంలో వివాహం
యూఏఈకి చెందిన ఓ వ్యాపారవేత్త ఆకాశవీధుల్లో తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. -
మౌలిక వసతుల విస్తరణతోనే అందరికీ చేరువగా న్యాయం
ప్రజానుకూల తీర్పులు ఇవ్వడం ద్వారా మాత్రమే అందరికీ అందుబాటులోకి న్యాయాన్ని తీసుకురాలేమని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. -
నిబంధనలు ఉల్లంఘించే పార్టీల గుర్తింపు రద్దు అధికారం ఈసీకి ఉండాలి
చట్టాలను, నమోదు నిబంధనలను ఉల్లంఘించే రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘాని(ఈసీ)కి తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టుకు సమర్పించిన వాదనల్లో పిటిషనర్ గట్టిగా కోరారు. -
గుజరాత్లో అకాల వర్షాలు
గుజరాత్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి. పలు జిల్లాల్లో పిడుగులు పడి 27 మంది మృతి చెందారు. -
36 మీటర్లు పూర్తయిన తవ్వకం
ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న 41 మందిని రక్షించడానికి కొండ పైభాగం నుంచి చేపట్టిన 86 మీటర్ల డ్రిల్లింగ్ పనిలో సోమవారం రాత్రికి 36 మీటర్లు పూర్తయింది. -
మార్చి నాటికి ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం ఖరారు
అమెరికా నుంచి 31 ఎంక్యూ-9బి ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల కొనుగోలుకు ఉద్దేశించిన కీలక ఒప్పందాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి ఖరారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. -
సంక్షిప్త వార్తలు
మహాత్మా గాంధీ గత శతాబ్దంలో మహా పురుషుడైతే, ఈ శతాబ్దంలో ప్రధాని నరేంద్ర మోదీ యుగ పురుషుడని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అభివర్ణించారు. -
Jagdeep Dhankar: గాంధీ మహా పురుషుడు.. మోదీ యుగ పురుషుడు: ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్
ప్రముఖ జైన మత గురువు, ఆధ్యాత్మిక వేత్త శ్రీమద్ రాజ్చంద్రాజీ జయంతి వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Gold Saree: బంగారు చీర.. ధర రూ.2.25 లక్షలు
-
Kurnool: పతకాలపైనా పార్టీ ప్రచారమే.. వికెట్ల మీదా జగన్ చిత్రాలు
-
Rameswaram Express: రామేశ్వరం ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం
-
Ravi Shastri: 2024 పొట్టి కప్పులో భారత్ గట్టి పోటీదారు: రవిశాస్త్రి
-
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు