Kerala: సీఎం పినరయ్‌ విజయన్‌ను తుపాకీతో కాలుస్తా: మాజీ ఎమ్మెల్యే భార్య హెచ్చరిక

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్‌ భార్య ఉషా జార్జ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను సీఎం పినరయి విజయన్‌ వేధిస్తున్నారని, తుపాకీతో ముఖ్యమంత్రిని కాలుస్తానని ఆమె బహిరంగంగా బెదిరింపులు చేశారు.

Published : 04 Jul 2022 02:02 IST

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్‌ భార్య ఉషా జార్జ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను సీఎం పినరయి విజయన్‌ వేధిస్తున్నారని, తుపాకీతో ముఖ్యమంత్రిని కాలుస్తానని ఆమె బహిరంగంగా బెదిరింపులు చేశారు. లైంగిక వేధింపుల కేసులో పీసీ జార్జ్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై బయటికి వచ్చారు. ఈ సందర్భంగా ఉషా జార్జ్‌ మాట్లాడుతూ.. తన భర్తపై తప్పుడు కేసులు పెట్టారని, దీని వెనుక సీఎం హస్తం ఉందని ఆరోపించారు. ఈ మేరకు మీడియాతో ఆమె ఆదివారం మాట్లాడారు. 

‘‘ఇదొక తప్పుడు కేసు. కేరళ సీఎం నా భర్తను, కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నా భర్త చాలా అమాయకుడు. సీఎం అవినీతిని బయటపెట్టినందుకే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. మా నాన్న రివాల్వర్‌తో సీఎంను కాల్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అని ఉషా జార్జ్ హెచ్చరించారు.

గతంలో సీఎం పినరయి విజయన్‌పై పీసీ జార్జ్‌ అవినీతి అభియోగాలు మోపారు. వ్యాపారవేత్త ఫారిస్‌ అబూబకర్‌తో ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను అభ్యర్థించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని