మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు అస్వస్థత

మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, బలహీనతతో దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.

Updated : 13 Oct 2021 19:13 IST

దిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. రెండ్రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్‌లో చేరారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ఈ ఏడాది కొవిడ్‌ రెండో వేవ్‌ సమయంలో మన్మోహన్‌కు కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దాంతో అప్పట్లో ఆయన ఆస్పత్రిలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని