Chhattisgarh: రాయ్పూర్ రైల్వేస్టేషన్లో పేలుడు.. జవాన్లకు గాయాలు
ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ రైల్వేస్టేషన్లో స్వల్ప పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి.....
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ రైల్వేస్టేషన్లో స్వల్ప పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. డిటోనేటర్లు, హెచ్డీ కాట్రిడ్జ్ వంటి మందుగుండు సామగ్రితో కూడిన కంటైనర్ను రైలులోకి ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడి పేలుడు సంభవించింది. ఆ సమయంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలు అక్కడే ఆగి ఉండటంతో జవాన్లకు గాయాలయ్యాయి.
సీఆర్పీఎఫ్ జవాన్లతో ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలు ఒడిశాలోని ఝర్సుగూడ నుంచి జమ్ముకు వెళ్తోంది. ఉదయం ఆరున్నర సమయంలో రాయ్పూర్ స్టేషన్లోని ప్లాట్ఫామ్ వద్ద రైలు నిలిపి ఉంచిన సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు జవాన్లు గాయపడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!