Road Accident: రోడ్డుపై ట్రక్కు బీభత్సం.. ప్రమాదంలో నలుగురి మృతి

ఝార్ఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 16 Feb 2022 12:54 IST

రామ్‌గఢ్‌: ఝార్ఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రామ్‌గఢ్‌లోని పటేల్‌చౌక్‌లో అతివేగంతో అదుపు తప్పిన భారీ ట్రక్కు.. రోడ్డుపై బీభత్సం సృష్టించింది. ఎదురుగా ఉన్న ప్రతి వాహనాన్ని ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ట్రక్కు ధాటికి పలు వాహనాలు ఎగిరిపడ్డాయి. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు.. ట్రక్కులో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీశారు. ఈ ఘటనలో 6 వాహనాలు నుజ్జునుజ్జయినట్లు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని