Precaution Dose: మూడో డోసూ ఉచితమే.. జులై 15 నుంచి అందరికీ ప్రికాషన్ డోసు..!
దేశంలో 18 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ మూడో డోసు (Precaution Dose)ను ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.
ప్రభుత్వ కేంద్రాల్లో పంపిణీకి ప్రత్యేక కార్యక్రమం
దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (Coronavirus) మరోసారి విజృంభిస్తోన్న వేళ.. వ్యాక్సినేషన్పై (Vaccination) కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. 18 నుంచి 59 ఏళ్ల వారికి మూడో డోసు (Precaution Dose)ను ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 75 రోజుల పాటు కొనసాగే ఈ ప్రత్యేక కార్యక్రమం జులై 15 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకుంటోన్న ‘ఆజాదీకా అమృత్ మహాత్సవ్’లో భాగంగా ప్రికాషన్ డోసు (Booster) పంపిణీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపాయి.
‘దేశ జనాభాలో మెజారిటీ ప్రజలు తొమ్మిది నెలల క్రితం రెండు డోసులు తీసుకున్నారు. అయితే, రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత వ్యాక్సిన్ల వల్ల పొందే యాంటీబాడీలు క్రమంగా క్షీణించిపోతున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ICMR)తోపాటు ఇతర అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బూస్టర్ డోసు ఇవ్వడం వల్ల రోగనిరోధక స్పందనలను మరింత పెంచవచ్చని సూచిస్తున్నాయి’ అని జాతీయ వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఓ అధికారి వెల్లడించారు. ఈ క్రమంలో 18ఏళ్ల వయసు పైబడిన వారికి ప్రత్యేక కార్యక్రమం ద్వారా బూస్టర్ డోసును (Booster Dose) ఉచితంగా పంపిణీ చేసే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. జులై 15 నుంచి ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
అధికారిక లెక్కల ప్రకారం, దేశంలో కరోనా వ్యాక్సినేషన్కు అర్హులైన వారిలో 96శాతం మంది ఒకడోసు తీసుకోగా.. 87శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. ప్రికాషన్ డోసుగా పిలుస్తోన్న మూడో డోసును మాత్రం 18 నుంచి 59ఏళ్ల వయసు వారికి కేవలం ప్రైవేటు కేంద్రాల్లోనే పంపిణీ చేస్తున్నారు. దేశంలో 77కోట్ల మంది ఈ వయసు వారు ఉండగా అందులో కేవలం ఒకశాతం మాత్రమే ఇప్పటివరకు ప్రికాషన్ డోసును తీసుకున్నారు. 60ఏళ్ల వయసు పైబడిన వారితోపాటు ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లకు మాత్రం బూస్టర్ డోసును ఉచితంగా అందిస్తున్నారు. వీరి సంఖ్య 16కోట్లు ఉండగా వారిలో 26శాతం మాత్రమే మూడో డోసు తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్ రెండు, మూడు డోసుల మధ్య వ్యవధిని తొమ్మిది నుంచి ఆరు నెలలకు తగ్గించింది. దీంతో రెండో డోసు తీసుకొని ఆరు నెలలు పూర్తైన వారు మూడో డోసును (Booster Dose) తీసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు.. భారత్ తీవ్ర అభ్యంతరం
Kejriwal arrest: దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణించింది. దిల్లీలోని ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ రేపు కోర్టులో చెబుతారు: సతీమణి సంచలన ప్రకటన
Sunita Kejriwal: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన సతీమణి సునీత మరో వీడియో సందేశం విడుదల చేశారు. ఈ కేసుకు సంబంధించి నిజాలన్నీ ఆయన గురువారం కోర్టులో బయటపెడతారని చెప్పారు. -
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఆరుగురు నక్సల్స్ హతం
Encounter: బీజాపుర్ జిల్లాలో బుధవారం ఎన్కౌంటర్ జరిగింది. ఆరుగురు మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో మునావర్ ఫరూఖీ
బిగ్బాస్ విన్నర్ మునావర్ ఫరూఖీ(Munawar Faruqui)ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
బిహార్లో ఒకే ఇంట్లో ఏడుగురు ‘పోలీస్’ సిస్టర్స్..
బిహార్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసు - అబ్కారీ శాఖల్లో, కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారు. -
ఓటీపీ మోసాలకు సరికొత్త విరుగుడు
ఆధునిక కాలంలో ఓటీపీ మోసాలు, పాస్వర్డ్ హ్యాకింగ్ ఉదంతాలు ఎక్కువయ్యాయి. వీటి కట్టడికి హిమాచల్ ప్రదేశ్లోని మండీ ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
గాజా వివాదంపై అమెరికా తీరుకు నిరసన.. పీహెచ్డీ డిగ్రీనీ వెనక్కి ఇచ్చేసిన సందీప్పాండే
దాదాపు ఆర్నెల్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గత జనవరిలో రామన్ మెగసెసె అవార్డు వదులుకొంటున్నట్లు ప్రకటించిన సామాజిక ఉద్యమకారుడు సందీప్పాండే బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి తాను చేసిన పీహెచ్డీ డిగ్రీని సైతం తాజాగా వెనక్కు ఇచ్చేశారు. -
భాజపా మాయ నుంచి యువత బయటకు రావాలి
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని భాజపా నిలబెట్టుకోలేదు. అబద్ధపు వాగ్దానం ఎందుకు చేశారని యువత ఇప్పుడు ఆ పార్టీని ప్రశ్నిస్తోంది. -
యూట్యూబ్ తొలగించిన వీడియోలు 22.5 లక్షలు
సామాజిక మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు మన దేశానికి చెందిన 22.5 లక్షల వీడియోలను గత ఏడాది అక్టోబరు- డిసెంబరు మధ్య యూట్యూబ్ తొలగించింది. -
2-3 రోజుల్లో 5లక్షల టన్నుల ఉల్లి సేకరణ
ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగించడం వల్ల మార్కెట్లో ఈ నిత్యావసర వస్తువు ధర పడిపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కేంద్రం మంగళవారం స్పందించింది. -
రూ.60కే ఇంటి భోజనం
మొబైల్లో ఆర్డర్ చేస్తే చాలు.. తక్కువ ధరకు ఇంటికే లంచ్ బాక్స్ వస్తుంది. ఇది కేరళలో ఆదరణ పొందుతున్న డ్వాక్రా మహిళలు ప్రారంభించిన ‘కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్టు’. -
ఒకే కుటుంబం..1,200 మంది ఓటర్లు
లోక్సభ ఎన్నికల వేళ.. అస్సాంలోని తేజ్పుర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నేపాలీ పామ్ గ్రామం వార్తల్లో నిలిచింది. ప్రచారంలో భాగంగా స్థానిక అభ్యర్థులు ఈ పల్లె బాటపట్టారు. -
‘బటర్ చికెన్’ వివాదంలో పరువు నష్టం వ్యాఖ్యలు
దేశంలో ప్రసిద్ధి గాంచిన ‘బటర్ చికెన్’, ‘దాల్ మఖానీ’ వంటకాలను ఎవరు కనుగొన్నారన్న అంశంపై మొదలైన న్యాయవివాదం మరింత ముదురుపాకానపడింది. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీకి బాందాలో అత్యవసర చికిత్స
యూపీ జైలులో ఉన్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (60)కి మంగళవారం బాందా వైద్య కళాశాలలో అత్యవసర చికిత్స అందించారు. -
దిల్లీలో ఆప్, భాజపా నేతల నిరసన
దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆప్ నేతలు చేపట్టిన ప్రధాని మోదీ నివాసం ముట్టడిలో ఉద్రిక్తత నెలకొంది. -
జమ్మూకశ్మీర్లో ఏఎఫ్ఎస్పీఏ ఉపసంహరణను పరిశీలిస్తాం
జమ్మూకశ్మీర్లో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) ఉపసంహరించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని హోంమంత్రి అమిత్ షా మంగళవారం తెలిపారు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై చర్యలు అంతటా ఒకేలా ఉండాలి
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే రాజకీయ పార్టీల నాయకులపై చర్యలు అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా ఉండాలని భాజపా డిమాండ్ చేసింది. -
లావోస్లో సైబర్ మోసం
థాయ్లాండ్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి 25 మంది భారతీయులను మోసం చేయడంతో పాటు వారితో సైబర్ నేరాలు చేయించిన ఇద్దరిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. -
భోజ్శాలలో కొనసాగిన సరస్వతి పూజలు
మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోని వివాదాస్పద భోజ్శాల ప్రాంగణంలో మంగళవారం హిందువులు సరస్వతి దేవికి పూజలు నిర్వహించారు. -
కస్టడీ నుంచి ఆదేశాలివ్వకుండా కేజ్రీవాల్ను అడ్డుకోండి
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేయకుండా ఆయన్ను నిలువరించాలంటూ దిల్లీ హైకోర్టులో మంగళవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
మమతపై భాజపా నేత అభ్యంతరకర వ్యాఖ్యలు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యాన్ని కించపరుస్తూ ఆ రాష్ట్ర భాజపా నేత దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు చేసినట్లు ఒక వీడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు.. భారత్ తీవ్ర అభ్యంతరం
-
పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్: కేటీఆర్
-
ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
కెప్టెన్గా తొలిసారి గిల్కు రూ. 12 లక్షల జరిమానా.. పునరావృతమైతే ఒక మ్యాచ్ వేటు!
-
ముసుగు వీరుడు వస్తున్నాడు.. ఇంటికి పంపేందుకు మేమూ సిద్ధమే: చంద్రబాబు
-
రెండేళ్లలో 151 నుంచి 80 కిలోలకు.. కంపెనీ సీఈఓ ఇన్స్పైరింగ్ స్టోరీ