Taliban’s return: నిజంగా..! తాలిబన్లు అధికారంలోకి వచ్చారని సంతోషిస్తున్నారా..!
తాలిబన్లు అధికారం చేపట్టగానే పైకి చెప్పకపోయినా చుట్టుపక్కల దేశాలు తీవ్ర ఆందోళన చెందాయి. అక్కడి ఉగ్రవాదం తమ దేశాల్లోకి ఎక్కడ వ్యాపిస్తుందోనని భయపడుతున్నాయి. తాలిబన్ల విషయంలో సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్న
పైకి అంతా హ్యాపీ.. లోపలే టెన్షన్..!
ఆసియా దేశాల పరిస్థితి..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
తాలిబన్లు అధికారం చేపట్టగానే పైకి చెప్పకపోయినా చుట్టుపక్కల దేశాలు తీవ్ర ఆందోళన చెందాయి. అక్కడి ఉగ్రవాదం తమ దేశాల్లోకి ఎక్కడ వ్యాపిస్తుందోనని భయపడుతున్నాయి. తాలిబన్ల విషయంలో సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్న చైనా, రష్యాల్లో కూడా అంతర్గతంగా ఈ భయాందోళనలు ఉన్నాయి. పాకిస్థాన్ పైకి ఎన్నిచెప్పినా.. అఫ్గాన్ సరిహద్దుల్లో యుద్ధప్రాతిపదికన కంచెను నిర్మించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అమెరికా సైన్యం పూర్తిగా వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్ల రాజ్యం వచ్చేసింది. దీంతో శరణార్థుల సమస్యలు, ఉగ్రవాదం వంటి సమస్యలు పొరుగు దేశాలను భయపెడుతున్నాయి.
వాస్తవానికి పాక్ ఫుల్ హ్యాపీనా..?
తాలిబన్లు అధికారం చేపడుతుంటే తొలుత కేరింతలు కొట్టింది పాకిస్థానే. ఒక దశలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాలిబన్ ప్రతినిధి వలే మాట్లారు. తాలిబన్లపై పాక్కు బలమైన పట్టుంది. దశాబ్దాలుగా వారికి ఆయుధాలు, మద్దతు అందిస్తూ పాక్ అండగా నిలిచింది. ఒక రకంగా ఇక్కడ తాలిబన్ ప్రభుత్వం ఏర్పడటం భారత్పై వ్యూహాత్మకంగా సాధించిన విజయంగా భావిస్తోంది. ఉగ్రశిబిరాలను కూడా ఇక్కడకు తరలించేందుకు ప్రణాళికలు కూడా ఉన్నాయి. అందుకే పాక్కు చెందిన దాదాపు 10వరకు ఉగ్ర సంస్థలు తాలిబన్ల తరపున పోరాటంలో పాల్గొన్నాయి. ఇదంతా నాణేనికి ఒక వైపు.. ఇక మరో వైపు చూస్తే సరిహద్దు వివాదం ఉంది. 1896లో బ్రిటిష్ వారు నిర్దారించిన డ్యూరాండ్ రేఖ విషయంలో ఇరు దేశాల మధ్య వివాదం నడుస్తోంది. అందుకే ఇక్కడ కంచె నిర్మించకుండా అఫ్గానిస్థాన్ అడ్డుకొంటోంది. తాలిబన్లలోని ప్రధాన తెగ అయిన పష్తున్లు పాక్లోని క్వెట్టా,పెషావర్ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ఉన్నారు. దీంతో లక్షల సంఖ్యలో శరణార్థులు, ఉగ్రవాదులు అఫ్గాన్ నుంచి ఇక్కడకు చేరుతారనే భయాలు ఉన్నాయి. ఉగ్రవాదులు చైనా బీఆర్ఐ ప్రాజెక్టుకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని అనుమానిస్తోంది. అసలే దేశ ఆర్థిక పరిస్థితి మునిగిపోయే నావను తలపిస్తోంది. అందుకే 2,640 కిలోమీటర్ల సరిహద్దు వెంట ఈ ఏడాది ఇనుప కంచె నిర్మించింది. దీనిలో సరిహద్దు పొడవునా 2 మీటర్ల వెడల్పున్న ఫెన్సింగ్ చుట్టను మధ్య వేశారు. ఈ కంచె పాక్ వైపు 3.6 మీటర్ల ఎత్తు.. అఫ్గాన్ వైపు 4 మీటర్ల ఎత్తు ఉంది. సరిహద్దు వెంట 1000 చెక్పోస్టులు, ఇన్ఫ్రారెడ్ నిఘా కెమేరాలను అమర్చింది. కేవలం 16 ప్రదేశాల నుంచి సరిహద్దులు దాటే ప్రవేశం కల్పించింది.
వేచి చూడాల్సిందే..
పాక్ ఆక్రమిత భారత భూభాగానికి అఫ్గాన్తో సరిహద్దులు ఉన్నాయి. అఫ్గాన్ పౌర ప్రభుత్వంతో భారత్ మంచి సంబంధాలను నెలకొల్పుకొంది. కానీ, తాలిబన్లు మాత్రం మొదటి నుంచి భారత్ వ్యతిరేకులు. దీంతో పాక్, చైనాలకు అఫ్గానిస్థాన్లో పలుకుబడి పెరుగుతుంది. భారత్ అఫ్గాన్లోని దౌత్య కార్యాలయాన్ని మూసివేసింది. తమ భూభాగాన్ని ఏ దేశానికి వ్యతిరేకంగా వాడుకోనీయమని తాలిబన్లు చెబుతున్నా.. గత చరిత్ర చూస్తే దీనిని నమ్మలేని పరిస్థితి నెలకొంది. భారతీయులు అఫ్గాన్ వీడి వచ్చేయాలని ప్రభుత్వం అడ్వైజరీ కూడా జారీ చేసింది. నిన్న కాబుల్ నుంచి దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించింది.
డ్రాగన్కు షింజియాంగ్పై మనసులో ఆందోళన..
తాలిబన్ల ఆక్రమణ విషయం నిర్ధారణ కాగానే అమెరికా, యూకే,భారత్ వలే చైనా దౌత్యవేత్తలను తరలించలేదు. కానీ, సిబ్బంది సంఖ్యను మాత్రం గణనీయంగా తగ్గించింది. కాబుల్ ఎంబసీని తెరిచే ఉంచింది. అఫ్గాన్లోని చైనా వాసులు ఇళ్లుదాటి బయటకు రావద్దని హెచ్చరించింది. గత నెల తాలిబన్ నాయకులు చైనా పర్యటించి విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైనా ప్రాజెక్టులపై దాడులు జరగకుండా చూడాలని.. వీఘర్ ముస్లింలకు ఆశ్రయం ఇవ్వొద్దని కోరింది.
తాలిబన్లు విషయంలో అప్రమత్తంగా ఉండాలని చైనా సెక్యూరిటీ నిపుణులు ఆ దేశ పార్లమెంటరీ ఆఫీసర్లను హెచ్చరించారు. దాదాపు 400 మంది చైనా వేర్పాటు వాదులు తేలిక పాటి, భారీ ఆయుధాల వినియోగంపై తాలిబన్ల వద్ద శిక్షణ పొందినట్లు చైనీస్ పోలీస్ అకాడమీకి చెందిన వాంగ్ యానింగ్ నివేదిక ఇచ్చినట్లు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. తాలిబన్లే వారికి ఆయుధాలు ఇచ్చినట్లు ఆమె నివేదికలో పేర్కొంది. తాలిబన్లను పైకి ప్రదర్శించే మృదుత్వాన్ని చైనా ఏమాత్రం నమ్మలేని పరిస్థితి ఉందని ఈ నివేదిక చెబుతోంది.
ఆచితూచి రష్యా..
అఫ్గానిస్థాన్లో తాలిబన్ ప్రత్యర్థులకు సాయం చేసేందుకు రష్యా నిరాకరించింది. పైకి మాత్రం తాలిబన్ పాలనను స్వాగతిస్తున్నట్లు ప్రకటించినా.. లోలోపల ఆందోళన మాత్రం ఉంది. అందుకే, తాలిబన్ల కదలికలు పెరగ్గానే తజకిస్థాన్ సరిహద్దులకు భారీ ట్యాంకులు, సైనిక బలగాలను తరలించింది. నాటో కూటమి వలే రష్యా నిర్మించిన కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ (సీఎస్టీవో)లో తజకిస్తాన్ సభ్యదేశం. మధ్య ఆసియాలోని తన మిత్రదేశాలను సన్నద్ధం చేసేందుకు మిత్రదేశాలతో కలిసి తజక్లోని హెర్బ్-మెయిడాన్ ఫైరింగ్ రేంజిలో యుద్ధ విన్యాసాలు చేసింది. ఇది అఫ్గాన్ సరిహద్దుకు కేవలం 12 మైళ్ల దూరంలోనే ఉంది. దీనిలో రష్యాకు చెందిన 2,500 మంది సైనికులు, ట్యాంకులు, సూ-25 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఈ యుద్ధవిన్యాసాల్లో తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సైన్యాలు పాల్గొన్నాయి.
అందుకే తాలిబన్ల గుర్తింపు విషయంలో నిన్న రష్యా విదేశంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆచితూచి స్పందించారు. వారిని ఆఫ్గాన్ అధికారిక ప్రభుత్వంగా గుర్తించేందుకు మాకు తొందరేమీ లేదని తెలిపారు. అంతేకాదు.. అన్ని వర్గాలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అఫ్గాన్ నుంచి మతమౌఢ్యం, ఛాందసవాదం మధ్య ఆసియాకు విస్తరిస్తాయని రష్యా భయపడుతోంది.
శరణార్థులు.. హజరాలపై ఆందోళన..
అఫ్గానిస్థాన్లో జరిగిన మార్పులతో అత్యధిక ఆందోళనకు గురైన దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి. యూరేషియా గ్రూప్ విశ్లేషణ ప్రకారం ‘‘అఫ్గాన్ నుంచి వచ్చే శరణార్థులు, మాదక ద్రవ్యాలు, హజరా ముస్లింలపై తాలిబన్ల అత్యాచారాలు అడ్డుకోవడం’’ వంటి సవాళ్లు ఎదురుకానున్నాయి. హజరాల్లో అత్యధిక మంది షియా వర్గానికి చెందినవారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ సరిహద్దులో ఇరాన్ బలగాల సంఖ్యను మరింత పెంచనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?