Taliban’s return: నిజంగా..! తాలిబన్లు అధికారంలోకి వచ్చారని సంతోషిస్తున్నారా..!
తాలిబన్లు అధికారం చేపట్టగానే పైకి చెప్పకపోయినా చుట్టుపక్కల దేశాలు తీవ్ర ఆందోళన చెందాయి. అక్కడి ఉగ్రవాదం తమ దేశాల్లోకి ఎక్కడ వ్యాపిస్తుందోనని భయపడుతున్నాయి. తాలిబన్ల విషయంలో సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్న
పైకి అంతా హ్యాపీ.. లోపలే టెన్షన్..!
ఆసియా దేశాల పరిస్థితి..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
తాలిబన్లు అధికారం చేపట్టగానే పైకి చెప్పకపోయినా చుట్టుపక్కల దేశాలు తీవ్ర ఆందోళన చెందాయి. అక్కడి ఉగ్రవాదం తమ దేశాల్లోకి ఎక్కడ వ్యాపిస్తుందోనని భయపడుతున్నాయి. తాలిబన్ల విషయంలో సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్న చైనా, రష్యాల్లో కూడా అంతర్గతంగా ఈ భయాందోళనలు ఉన్నాయి. పాకిస్థాన్ పైకి ఎన్నిచెప్పినా.. అఫ్గాన్ సరిహద్దుల్లో యుద్ధప్రాతిపదికన కంచెను నిర్మించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అమెరికా సైన్యం పూర్తిగా వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్ల రాజ్యం వచ్చేసింది. దీంతో శరణార్థుల సమస్యలు, ఉగ్రవాదం వంటి సమస్యలు పొరుగు దేశాలను భయపెడుతున్నాయి.
వాస్తవానికి పాక్ ఫుల్ హ్యాపీనా..?
తాలిబన్లు అధికారం చేపడుతుంటే తొలుత కేరింతలు కొట్టింది పాకిస్థానే. ఒక దశలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాలిబన్ ప్రతినిధి వలే మాట్లారు. తాలిబన్లపై పాక్కు బలమైన పట్టుంది. దశాబ్దాలుగా వారికి ఆయుధాలు, మద్దతు అందిస్తూ పాక్ అండగా నిలిచింది. ఒక రకంగా ఇక్కడ తాలిబన్ ప్రభుత్వం ఏర్పడటం భారత్పై వ్యూహాత్మకంగా సాధించిన విజయంగా భావిస్తోంది. ఉగ్రశిబిరాలను కూడా ఇక్కడకు తరలించేందుకు ప్రణాళికలు కూడా ఉన్నాయి. అందుకే పాక్కు చెందిన దాదాపు 10వరకు ఉగ్ర సంస్థలు తాలిబన్ల తరపున పోరాటంలో పాల్గొన్నాయి. ఇదంతా నాణేనికి ఒక వైపు.. ఇక మరో వైపు చూస్తే సరిహద్దు వివాదం ఉంది. 1896లో బ్రిటిష్ వారు నిర్దారించిన డ్యూరాండ్ రేఖ విషయంలో ఇరు దేశాల మధ్య వివాదం నడుస్తోంది. అందుకే ఇక్కడ కంచె నిర్మించకుండా అఫ్గానిస్థాన్ అడ్డుకొంటోంది. తాలిబన్లలోని ప్రధాన తెగ అయిన పష్తున్లు పాక్లోని క్వెట్టా,పెషావర్ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ఉన్నారు. దీంతో లక్షల సంఖ్యలో శరణార్థులు, ఉగ్రవాదులు అఫ్గాన్ నుంచి ఇక్కడకు చేరుతారనే భయాలు ఉన్నాయి. ఉగ్రవాదులు చైనా బీఆర్ఐ ప్రాజెక్టుకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని అనుమానిస్తోంది. అసలే దేశ ఆర్థిక పరిస్థితి మునిగిపోయే నావను తలపిస్తోంది. అందుకే 2,640 కిలోమీటర్ల సరిహద్దు వెంట ఈ ఏడాది ఇనుప కంచె నిర్మించింది. దీనిలో సరిహద్దు పొడవునా 2 మీటర్ల వెడల్పున్న ఫెన్సింగ్ చుట్టను మధ్య వేశారు. ఈ కంచె పాక్ వైపు 3.6 మీటర్ల ఎత్తు.. అఫ్గాన్ వైపు 4 మీటర్ల ఎత్తు ఉంది. సరిహద్దు వెంట 1000 చెక్పోస్టులు, ఇన్ఫ్రారెడ్ నిఘా కెమేరాలను అమర్చింది. కేవలం 16 ప్రదేశాల నుంచి సరిహద్దులు దాటే ప్రవేశం కల్పించింది.
వేచి చూడాల్సిందే..
పాక్ ఆక్రమిత భారత భూభాగానికి అఫ్గాన్తో సరిహద్దులు ఉన్నాయి. అఫ్గాన్ పౌర ప్రభుత్వంతో భారత్ మంచి సంబంధాలను నెలకొల్పుకొంది. కానీ, తాలిబన్లు మాత్రం మొదటి నుంచి భారత్ వ్యతిరేకులు. దీంతో పాక్, చైనాలకు అఫ్గానిస్థాన్లో పలుకుబడి పెరుగుతుంది. భారత్ అఫ్గాన్లోని దౌత్య కార్యాలయాన్ని మూసివేసింది. తమ భూభాగాన్ని ఏ దేశానికి వ్యతిరేకంగా వాడుకోనీయమని తాలిబన్లు చెబుతున్నా.. గత చరిత్ర చూస్తే దీనిని నమ్మలేని పరిస్థితి నెలకొంది. భారతీయులు అఫ్గాన్ వీడి వచ్చేయాలని ప్రభుత్వం అడ్వైజరీ కూడా జారీ చేసింది. నిన్న కాబుల్ నుంచి దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించింది.
డ్రాగన్కు షింజియాంగ్పై మనసులో ఆందోళన..
తాలిబన్ల ఆక్రమణ విషయం నిర్ధారణ కాగానే అమెరికా, యూకే,భారత్ వలే చైనా దౌత్యవేత్తలను తరలించలేదు. కానీ, సిబ్బంది సంఖ్యను మాత్రం గణనీయంగా తగ్గించింది. కాబుల్ ఎంబసీని తెరిచే ఉంచింది. అఫ్గాన్లోని చైనా వాసులు ఇళ్లుదాటి బయటకు రావద్దని హెచ్చరించింది. గత నెల తాలిబన్ నాయకులు చైనా పర్యటించి విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైనా ప్రాజెక్టులపై దాడులు జరగకుండా చూడాలని.. వీఘర్ ముస్లింలకు ఆశ్రయం ఇవ్వొద్దని కోరింది.
తాలిబన్లు విషయంలో అప్రమత్తంగా ఉండాలని చైనా సెక్యూరిటీ నిపుణులు ఆ దేశ పార్లమెంటరీ ఆఫీసర్లను హెచ్చరించారు. దాదాపు 400 మంది చైనా వేర్పాటు వాదులు తేలిక పాటి, భారీ ఆయుధాల వినియోగంపై తాలిబన్ల వద్ద శిక్షణ పొందినట్లు చైనీస్ పోలీస్ అకాడమీకి చెందిన వాంగ్ యానింగ్ నివేదిక ఇచ్చినట్లు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. తాలిబన్లే వారికి ఆయుధాలు ఇచ్చినట్లు ఆమె నివేదికలో పేర్కొంది. తాలిబన్లను పైకి ప్రదర్శించే మృదుత్వాన్ని చైనా ఏమాత్రం నమ్మలేని పరిస్థితి ఉందని ఈ నివేదిక చెబుతోంది.
ఆచితూచి రష్యా..
అఫ్గానిస్థాన్లో తాలిబన్ ప్రత్యర్థులకు సాయం చేసేందుకు రష్యా నిరాకరించింది. పైకి మాత్రం తాలిబన్ పాలనను స్వాగతిస్తున్నట్లు ప్రకటించినా.. లోలోపల ఆందోళన మాత్రం ఉంది. అందుకే, తాలిబన్ల కదలికలు పెరగ్గానే తజకిస్థాన్ సరిహద్దులకు భారీ ట్యాంకులు, సైనిక బలగాలను తరలించింది. నాటో కూటమి వలే రష్యా నిర్మించిన కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ (సీఎస్టీవో)లో తజకిస్తాన్ సభ్యదేశం. మధ్య ఆసియాలోని తన మిత్రదేశాలను సన్నద్ధం చేసేందుకు మిత్రదేశాలతో కలిసి తజక్లోని హెర్బ్-మెయిడాన్ ఫైరింగ్ రేంజిలో యుద్ధ విన్యాసాలు చేసింది. ఇది అఫ్గాన్ సరిహద్దుకు కేవలం 12 మైళ్ల దూరంలోనే ఉంది. దీనిలో రష్యాకు చెందిన 2,500 మంది సైనికులు, ట్యాంకులు, సూ-25 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఈ యుద్ధవిన్యాసాల్లో తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సైన్యాలు పాల్గొన్నాయి.
అందుకే తాలిబన్ల గుర్తింపు విషయంలో నిన్న రష్యా విదేశంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆచితూచి స్పందించారు. వారిని ఆఫ్గాన్ అధికారిక ప్రభుత్వంగా గుర్తించేందుకు మాకు తొందరేమీ లేదని తెలిపారు. అంతేకాదు.. అన్ని వర్గాలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అఫ్గాన్ నుంచి మతమౌఢ్యం, ఛాందసవాదం మధ్య ఆసియాకు విస్తరిస్తాయని రష్యా భయపడుతోంది.
శరణార్థులు.. హజరాలపై ఆందోళన..
అఫ్గానిస్థాన్లో జరిగిన మార్పులతో అత్యధిక ఆందోళనకు గురైన దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి. యూరేషియా గ్రూప్ విశ్లేషణ ప్రకారం ‘‘అఫ్గాన్ నుంచి వచ్చే శరణార్థులు, మాదక ద్రవ్యాలు, హజరా ముస్లింలపై తాలిబన్ల అత్యాచారాలు అడ్డుకోవడం’’ వంటి సవాళ్లు ఎదురుకానున్నాయి. హజరాల్లో అత్యధిక మంది షియా వర్గానికి చెందినవారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ సరిహద్దులో ఇరాన్ బలగాల సంఖ్యను మరింత పెంచనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. -
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
వచ్చే ఏడాదిలో నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేసింది. UPSC 2025 Calendar -
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM