S Jaishankar: పేద దేశం నుంచి.. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా..!
గత 75 ఏళ్లలో భారత్ ఆర్థికంగా నిలదొక్కుకున్న విధానాన్ని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కొనియాడారు. వలసవాదం భారత్ను పేద దేశంగా మిగిల్చిందని.........
న్యూయార్క్: గత 75 ఏళ్లలో భారత్ ఆర్థికంగా నిలదొక్కుకున్న విధానాన్ని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ కొనియాడారు. వలసవాదం భారత్ను పేద దేశంగా మిగిల్చిందని.. కానీ, నేడు ఇదే భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం గర్వకారణమన్నారు. ‘18వ శతాబ్దంలో భారతదేశం ప్రపంచ జీడీపీలో నాలుగింట ఒక వంతు వాటాను కలిగి ఉండేది. 20వ శతాబ్దం మధ్య నాటికి వలసవాదం మా దేశాన్ని అత్యంత పేద దేశాల్లో ఒకటిగా ఉండేలా చేసింది. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 75వ సంవత్సరంలో భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మీ ముందు గర్వంగా నిలబడింది’ అని ఎస్ జైశంకర్ అన్నారు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ‘ఇండియా@75’ కార్యక్రమంలో జైశంకర్ ప్రసంగించారు. కరోనాకు వ్యతిరేకంగా పోరాటం సహా భారత్ సాధించిన విజయాల గురించి ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ‘ఇటీవలి కాలంలో డిజిటల్ టెక్నాలజీ ఆహార భద్రతా వలయాన్ని విజయవంతంగా అభివృద్ధి చేసింది. డిజిటల్ విధానంలో 40 కోట్ల మంది ప్రజలు క్రమం తప్పకుండా ఆహారం పొందుతున్నారు. 200 కోట్లకుపైగా వ్యాక్సిన్లను అందించాం’ అని విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నారు. ఐరాసపై భారత్కు ఉన్న విశ్వాసాన్ని జైశంకర్ పునరుద్ఘాటించారు. యూఎన్ చార్టర్ సూత్రాలపై పూర్తి నమ్మకం ఉందని.. ఐక్యరాజ్యసమితితో తన భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముఖ్తార్ అన్సారీ చావుతో న్యాయం జరిగింది: అల్కా రాయ్
ముఖ్తార్ అన్సారీ చావుతో తన కుటుంబానికి న్యాయం జరిగిందని దివంగత భాజపా ఎమ్మెల్యే ఆనంద్రాయ్ సతీమణి అల్కారాయ్ అన్నారు. -
కేంద్ర మంత్రికి కృతజ్ఞతతో..! నామినేషన్ రుసుం చెల్లించిన విద్యార్థులు
కేరళలోని అత్తింగళ్ నుంచి బరిలో దిగిన భాజపా అభ్యర్థి, విదేశాంగ సహాయ మంత్రి వి.మురళీధరన్ నామినేషన్ డిపాజిట్ సొమ్ము చెల్లించేందుకు విద్యార్థులు ముందుకు రావడం విశేషం.
తాజా వార్తలు (Latest News)
-
సముద్రంలో మరో ఆపరేషన్.. 23 మంది పాక్ పౌరులను రక్షించిన ఇండియన్ నేవీ
-
ముఖ్తార్ అన్సారీ చావుతో న్యాయం జరిగింది: అల్కా రాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/03/2024)
-
మరో పడవ హైజాక్.. రంగంలోకి భారత నేవీ
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
కేంద్ర మంత్రికి కృతజ్ఞతతో..! నామినేషన్ రుసుం చెల్లించిన విద్యార్థులు