Mehul Choksi: మళ్లీ కిడ్నాప్ చేస్తారేమో..!
మరోసారి తాను కిడ్నాప్కు గురవుతానేమోనని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ ఆందోళన చెందుతున్నాడని ఓ ఆంగ్ల వార్త సంస్థ పేర్కొంది. ఈ నెల మొదట్లో చోక్సీ బాంబే హైకోర్టును ఆశ్రయించిన విషయం
* పీఎన్బీ కుంభకోణం కేసులో నిందితుడు మెహూల్ చోక్సీ
ఇంటర్నెట్డెస్క్: మరోసారి తాను కిడ్నాప్నకు గురవుతానేమోనని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ ఆందోళన చెందుతున్నట్లు ఓ ఆంగ్ల వార్త సంస్థ పేర్కొంది. ఈ నెల మొదట్లో చోక్సీ బాంబే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాను ప్రయాణాలు చేయలేనని.. పరారీలో ఉన్న నేరగాడి కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అమలు చేసే ప్రొసీడింగ్స్ను నిలిపివేయాలని కోరిన విషయం తెలిసిందే.
‘‘నేను మరోసారి కిడ్నాప్నకు గురవుతానేమో. అక్కడి నుంచి గయాన తరలించవచ్చు. అక్కడ భారత్ ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. దానిని వాడుకొని అక్రమ మార్గాల్లో భారత్కు తరలించే అవకాశం ఉంది. నేను ఇప్పుడు అంటిగ్వాలోని నా ఇంట్లోనే ఉంటున్నాను. అనారోగ్య కారణాలతో ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. దీనికి తోడు భారతీయుల చేతిలో నేను చాలా దారుణమైన అనుభవాన్ని చవిచూశాను. దాని నుంచి కోలుకోలేను. గత అనుభవాలు, తీవ్రమైన భయం కారణంగా నా మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. మా డాక్టర్లు చెప్పకుండా ఇంటిబయట కాలు పెట్టే పరిస్థితి లేదు’’ అని చోక్సీ పేర్కొన్నట్లు ఆ వార్త సంస్థ వెల్లడించింది.
ఈ ఏడాది మే 23న ఆంటిగ్వాలో ఉన్నట్టుండి అదృశ్యమైన ఛోక్సీ రెండు రోజుల తర్వాత పక్కనే ఉన్న డొమినికాలో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. క్యూబా పారిపోయే ప్రయత్నంలో డొమినికాలోకి అక్రమంగా ప్రవేశించడంతో అతడిని అరెస్టు చేశారు. అయితే, ఛోక్సీని కిడ్నాప్ చేసి బలవంతంగా డొమినికా తీసుకెళ్లారని ఆయన తరఫు న్యాయవాదులు బలంగా ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే ఛోక్సీ గతంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. పారిపోయే అవకాశం ఉన్నందున అతడి పిటిషన్ను డొమినికా కోర్టు తిరస్కరించింది. అయితే జులైలో అనారోగ్య కారణాల దృష్ట్యా మరోసారి బెయిల్ కోసం ఛోక్సీ అభ్యర్థించారు. తీవ్రమైన హెమటోమాతో బాధపడుతున్న అతడికి వెంటనే న్యూరాలజిస్టు, న్యూరో సర్జికల్ కన్సల్టెంట్తో చికిత్స అందించాలని వైద్యులు సిఫార్సు చేశారు. అయితే ప్రస్తుతం ఆ వైద్య సేవలు డొమినికాలో అందుబాటులో లేకపోవడంతో ఆంటిగ్వా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఛోక్సీ కోరారు. దీంతో ఛోక్సీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 10 వేల కరీబియన్ డాలర్ల (సుమారు రూ.2.75 లక్షలు)ను పూచీకత్తుగా సమర్పించాలని అక్కడి కోర్టు ఆదేశించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ను రూ. 13,500 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఛోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ ప్రధాన నిందితులు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే ఛోక్సీ భారత్ నుంచి పారిపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!