టీకా తీసుకుంటే..94% ఆసుపత్రి ముప్పు తప్పినట్లే!
65ఏళ్ల వయసు పైబడినవారు వ్యాక్సిన్ తీసుకుంటే కొవిడ్తో ఆసుపత్రిలో చేరే ముప్పు 94శాతం తప్పినట్లేనని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది
అమెరికా సీడీసీ అధ్యయనంలో వెల్లడి
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ను పూర్తి మోతాదులో తీసుకున్నట్లయితే(రెండు డోసుల్లో) ఇక ఆసుపత్రి ముప్పు తప్పినట్లేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా 65ఏళ్ల వయసు పైబడినవారు వ్యాక్సిన్ తీసుకుంటే కొవిడ్తో ఆసుపత్రిలో చేరే ముప్పు 94శాతం తప్పినట్లేనని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా కరోనా వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొని మరణంబారిన పడే ప్రమాదం నుంచి గట్టెక్కినట్లేనని పేర్కొంది.
అమెరికాలో వ్యాక్సిన్ల ప్రభావాన్ని తెలుసుకునేందుకు అక్కడి వ్యాధి నియంత్రన నిర్మూలన కేంద్రం(సీడీసీ) ఓ అధ్యయనాన్ని చేపట్టింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 14రాష్ట్రాల్లో 24 ఆసుపత్రుల్లోని 417 మంది కొవిడ్ రోగుల సమాచారాన్ని విశ్లేషించింది. వీటిని వ్యాక్సిన్ తీసుకున్న మరో 187గ్రూపు వారితో పోల్చి చూసింది. తద్వారా పూర్తి మోతాదులో (రెండు డోసులు) వ్యాక్సిన్ తీసుకున్న వారు కొవిడ్తో ఆసుపత్రిలో చేరే ప్రమాదం 94శాతం తగ్గిందని గుర్తించింది. ఇక ఒక డోసు తీసుకున్న వారిలో 64శాతం ఆసుపత్రుల్లో చేరే ప్రమాదం తగ్గినట్లు సీడీసీ పేర్కొంది. దీంతో ప్రస్తుతం అమెరికాలో పంపిణీ అవుతోన్న ఫైజర్, మోడెర్నా టీకాలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు మరోసారి నిరూపితమయ్యాయని సీడీసీ అభిప్రాయపడింది. అంతేకాకుండా, వ్యాక్సిన్ తీసుకున్న రెండు వారాల తర్వాతే శరీరం పూర్తిస్థాయిలో రోగనిరోధకత ప్రతిస్పందనలను కలిగి ఉంటున్నట్లు సీడీసీ పేర్కొంది.
కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాలిస్తున్నట్లు తేలడం మనతోపాటు ఆసుపత్రులకు ఊరట కలిగించే విషయమని సీడీసీ డైరెక్టర్ రోషెల్లే వాలెన్స్కై పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం ఎంత ముఖ్యమో తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైరస్ సోకినా ఆసుపత్రుల్లో చేరాల్సినంత ప్రమాదం లేదనే విషయం మరోసారి నిరూపితమైందన్నారు. అందుకే కొవిడ్ రోగులతో ఆసుపత్రులు నిండిపోకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్ పంపిణీ ప్రయత్నాలకు విస్తరిస్తూనే ఉంటామన్నారు. తద్వారా ఆసుపత్రి సిబ్బంది, పడకలు, ఇతర సదుపాయాలను ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అందుబాటులో ఉంచవచ్చని సీడీసీ చీఫ్ వాలెన్స్కై పేర్కొన్నారు.
ఇజ్రాయెల్, బ్రిటన్ నివేదికల్లోనూ ఇవే ఫలితాలు..
కరోనా వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపే వాస్తవ ఫలితాల నివేదికలను ఈమధ్యే ఇజ్రాయెల్ కూడా వెల్లడించింది. ఇప్పటికే అక్కడి మొత్తం జనాభాలో 60శాతానికి పైగా వ్యాక్సిన్ పంపిణీ చేసిన ఇజ్రాయెల్.. వ్యాక్సిన్ల ప్రభావాన్ని అంచనా వేసేందుకు అధ్యయనాలు జరుపుతోంది. ఇందులో భాగంగా వృద్ధులకు వ్యాక్సిన్లు పూర్తి రక్షణ కల్పిస్తున్నాయని తాజాగా జరిపిన అధ్యయనంలో గుర్తించింది. అయితే, ప్రస్తుతం అక్కడ కేవలం ఫైజర్ టీకాను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఇక బ్రిటన్లో జరిపిన అధ్యయనంలోనూ కరోనా వ్యాక్సిన్ ఒక డోసు తీసుకున్నా దాదాపు 50శాతం రక్షణ కలుగుతుందని తేలింది. ముఖ్యంగా ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మహమ్మారి బారిన పడితే వారి నుంచి కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ప్రమాదం 50 శాతం తగ్గుతుందని కనుగొన్నారు. ప్రస్తుతం బ్రిటన్లో పంపిణీ చేస్తోన్న ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వారిపై పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్(పీహెచ్ఈ) అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
వృద్ధులను రక్షించుకున్నట్లే..!
కరోనా వైరస్ మహమ్మారి వృద్ధుల్లోనే అత్యంత తీవ్రత చూపిస్తున్న విషయం తెలిసిందే. 65ఏళ్ల తక్కువ వయసువారితో పోలిస్తే వృద్ధుల్లోనే 6 నుంచి 8శాతం కొవిడ్ మరణాలు ఎక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ అలబామా నిపుణులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ప్రాణాలు కోత్పోతున్న వారిలో ఎక్కవ మంది 65ఏళ్లు పైబడినవారే ఉంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో వ్యాక్సిన్ పంపిణీలో వారికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా అమెరికాలో ఇప్పటివరకు 65ఏళ్ల వయసుపైడిన వారిలో 65శాతం(3.7కోట్ల) మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు అమెరికా సీడీసీ వెల్లడించింది. అమెరికానే కాకుండా భారత్తోపాటు ఇతర దేశాల్లో టీకా పంపిణీలో తొలి ప్రాధాన్యం వృద్ధులకే ఇస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్