Vaccination: రెండు డోసులు తీసుకుంటే చనిపోయే అవకాశం 11 రెట్లు తక్కువ

రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో చనిపోయే అవకాశం 11 రెట్లు తక్కువని అమెరికా అధ్యయనం వెల్లడించింది

Updated : 17 Oct 2022 11:27 IST

అమెరికా అధ్యయనంలో వెల్లడి

వాషింగ్టన్‌: రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో చనిపోయే అవకాశం 11 రెట్లు తక్కువని అమెరికా అధ్యయనం వెల్లడించింది. అలాగే టీకాలు తీసుకోని వారితో పోలిస్తే 10 రెట్లు తక్కువగా ఆసుపత్రిలో చేరే అవకాశం ఉంటుందని పేర్కొంది. సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ప్రచురించిన మూడు అధ్యయనాల్లో ఒకటి ఈ విషయాన్ని వెల్లడించింది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని వ్యాక్సిన్‌ మరింత ప్రభావవంతంగా తగ్గిస్తోందని అధ్యయనం తెలిపింది.

అధ్యయనం చేపట్టారిలా..

జూన్-ఆగస్టు నెలల్లో ఆసుపత్రులు, అత్యవసర విభాగాల్లో చేరిన 32,000 మంది రోగులపై అధ్యయనం చేసి సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. అన్ని వయసుల వారికి వ్యాక్సిన్లు 86 శాతం ఆసుప్రతిలో చేరకుండా రక్షణ కల్పించాయి. కానీ, 75 ఏళ్లు దాటిన వారికి అది 76 శాతంగా పడిపోయిందని అధ్యయనం వెల్లడించింది. ఏదేమైనప్పటికీ  టీకాలు అధిక వయసు గలవారికి రక్షణ కల్పిస్తున్నాయని అధ్యయనంలో నిరూపితమైంది. ఆసుపత్రిలో చేరడం, ఐసీయూలో చికిత్స తీసుకోవడం వంటి వాటి నుంచి 82 శాతం కంటే ఎక్కువ మందికి ఈ టీకాలు రక్షణ కల్పించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని