Modi: పరిశోధన..ఆవిష్కరణ..మన జీవన విధానంలో భాగం: మోదీ
పరిశోధన, ఆవిష్కరణలు భారతీయుల జీవన విధానంలో భాగమని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న వైవిద్యం అందులో భాగమేనని తెలిపారు.
రాజ్కోట్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా విద్యా వ్యవస్థకు రూపకల్పన చేశామని ప్రధాని మోదీ (Modi) అన్నారు. భారతదేశం గతంలో కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని విమర్శించారు. రాజ్కోట్ (Rajkot) లోని శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ 75వ అమృత మహోత్సవాల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) ద్వారా ప్రధాని ప్రసంగించారు. 2014లో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఐటీ (IIT), ఐఐఎం (IIM) లాంటి ప్రముఖ విద్యా సంస్థలను గణనీయంగా పెంచామన్నారు.
భారతదేశపు ప్రాచీన గురుకుల విద్యా విధానాన్ని ప్రశంసించిన ప్రధాని.. అత్యున్నత జీవితం గడపాలంటే విజ్ఞాన సముపార్జనే సరైన మార్గమన్నారు. విద్యారంగంలో దేశం కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరించేందుకు సాధువులు, ఆధ్యాత్మిక వేత్తలు ఎంతగానో కృషి చేశారని చెప్పారు. ‘‘ భారతదేశ ఉజ్వల భవిష్యత్ కోసం ప్రస్తుత విద్యా విధానం, విద్యా సంస్థలు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. అందువల్ల దేశంలో విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం. 2014 తర్వాత దేశ వ్యాప్తంగా వైద్యకళాశాల సంఖ్య 65 శాతం పెరిగింది. ఐఐటీ, ఐఐఐటీ, ఐఐఎం లాంటి ఉన్నత విద్యా సంస్థలను కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశాం’’ అని మోదీ అన్నారు.
విద్యా రంగంలో ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శిగా నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు. ఆత్మతత్వం నుంచి పరమాత్మ తత్వం వరకు, ఆధ్యాత్మికత నుంచి ఆయుర్వేదం వరకు, సోషల్ సైన్స్ నుంచి సోలార్ సైన్స్ వరకు ఇలా అన్నింటా ప్రపంచదేశాలు భారత్ను అనుసరించాయని అన్నారు. లింగ సమానత్వం అనే అంశం తెరమీదకు రాకముందే భారత్లో మహిళలు, పురుషులతో పోటీ పడ్డారని అన్నారు. అప్పటి గురుకులాలు గార్గి, మైత్రేయి తదితర మహిళా పండితులను చర్చల్లో భాగం చేసి..లింగ సమానత్వంపై ప్రపంచానికి మార్గనిర్దేశం చేశాయని కొనియాడారు. ఇతర దేశాలు, రాజ్యాలు ఆయా రాజవంశాలతో గుర్తింపు పొందిన కాలంలో భారత్ మాత్రం గురుకులాల ద్వారా గుర్తింపు పొందింది’’ అని మోదీ అన్నారు.
కొన్ని శతాబ్దాలుగా.. భారతదేశంలోని గురుకులాలు సమానత్వం, సేవ, ఆప్యాయతకు ఉద్యానవనంలా మారాయని మోదీ అన్నారు. నలందా, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు భారతదేశ వైభవానికి పర్యాయపదాలుగా ఉండేవన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలు భారతదేశ జీవన విధానంలో భాగమని, ప్రస్తుతం మనం చూస్తున్న వైవిధ్యం వాటి ఫలితమేనని మోదీ అన్నారు. శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ నుంచి కనీసం 100-150 మంది వాలంటీర్లను ఈశాన్య రాష్ట్రాలకు పంపాలని మోదీ కోరారు. అక్కడి యువతతో మాట్లాడాలని, వారి జీవన విధానం గురించి రాయాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
PM Modi: ప్రచార సభలో తన తల్లి ఫొటోను చూసి ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ చిత్రాన్ని గీసిన యువకుడిని అభినందించారు. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!