Nitin Gadkari: కేంద్ర మంత్రి గడ్కరీకి మరోసారి బెదిరింపు ఫోన్ కాల్!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari)కి మరోసారి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. సోమవారం అర్థరాత్రి సమయంలో ఫోన్ కాల్ వచ్చినట్లు మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపారు. దీనిపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దిల్లీ: కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి, భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీ (Nitin Gadkari)కి మరోసారి బెదిరింపు ఫోన్కాల్ వచ్చింది. దిల్లీ (Delhi)లోని మోతీలాల్ నెహ్రూ రోడ్లో ఉన్న ఆయన అధికారిక నివాసానికి సోమవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘‘సోమవారం అర్థరాత్రి కేంద్ర మంత్రి అధికారిక నివాసానికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. మంత్రిగారితో మాట్లాడాలని, ఆయనను హెచ్చరించాలని హిందీలో చెబుతూ ఫోన్ కట్ చేశాడు’’ అని మంత్రి కార్యాలయ సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపారు. ‘‘మంత్రి కార్యాలయానికి వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ వివరాలు సేకరిస్తున్నాం. నిందితుడు ల్యాండ్లైన్ నంబర్ నుంచి ఫోన్ చేసినట్లు గుర్తించాం. దీనిపై పూర్తి దర్యాప్తు జరిపి నిందితుణ్ని అరెస్ట్ చేస్తాం’’ అని పోలీస్ అధికారి తెలిపారు.
గతంలో కూడా నాగ్పూర్లోని నితిన్ గడ్కరీ కార్యాలయానికి రెండుసార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. రూ.10కోట్లు ఇవ్వకపోతే ఆయన ప్రాణాలకు హాని కలిగిస్తామంటూ జయేశ్ పుజారీ అనే వ్యక్తి మూడు సార్లు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ జరిపి నిందితుడిపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!