విమాన ప్రమాదం ‘మిస్టరీ’ ఏంటో?
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్ విమానాశ్రయానికి సమీపంలో చోటు చేసుకున్న ఉక్రెయిన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరావట్లేదు. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రమాదంపై అనేక ఊహాగానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా........
బ్లాక్బాక్స్ ఇవ్వనంటోన్న ఇరాన్
రెండు రోజుల కిందే చెక్ చేశామన్న బోయింగ్
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్ విమానాశ్రయానికి సమీపంలో చోటు చేసుకున్న ఉక్రెయిన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరావట్లేదు. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రమాదంపై అనేక ఊహాగానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా విమానానికి చెందిన బ్లాక్బాక్స్ను బోయింగ్ కంపెనీకి ఇచ్చేందుకు ఇరాన్ నిరాకరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ప్రమాదానికి గురైన ఉక్రెయిన్ విమానం నుంచి రెండు బ్లాక్బాక్స్లను ఇరాన్ రెస్క్యూ బృందం సేకరించింది. అయితే ఈ బ్లాక్బాక్స్లను బోయింగ్కు ఇచ్చేందుకు ఇరాన్ నిరాకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ఉక్రెయిన్ ఏమందంటే..
మరోవైపు ఇంజిన్ వైఫల్యం కారణంగానే విమానం కూలిందని తొలుత చెప్పిన ఉక్రెయిన్.. ఇప్పుడు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది. ఘటన తర్వాత స్పందించిన ఉక్రెయిన్.. ప్రమాదం వెనుక ఎలాంటి ఉగ్రకోణం లేదని, క్షిపణి దాడి జరగలేదని పేర్కొంది. ఇంజిన్ విఫలమవడం వల్లే కూలినట్లు తెలిపింది. అయితే తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. అందులో ఇంజిన్ వైఫల్యం అనే పదాన్ని తొలగించింది. ప్రమాదానికి గల కారణాన్ని ఇప్పుడే చెప్పలేమని, దర్యాప్తు తర్వాతే ఓ అంచనాకు రాగలమని వెల్లడించింది. ప్రమాదంపై ఇంతకు ముందు ఇచ్చిన ప్రకటన అధికారికం కాదని తెలిపింది. ఘటనకు గల కారణాలపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని ఉక్రెయిన్ ప్రధాని చెప్పారు.
విమానం బానే ఉందా..
ఘటనపై బోయింగ్ సంస్థ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే విమానాన్ని రెండు రోజుల ముందే చెక్ చేశామని, అంతా బాగానే ఉందని పేర్కొంది. ‘ప్రమాదానికి గురైన విమానాన్ని 2016లో తయారుచేశాం. బోయింట్ ఫ్యాక్టరీ నుంచి నేరుగా ఎయిర్లైన్కు అందించాం. జనవరి 6నే టెక్నికల్ మెయింటనెన్స్ నిర్వహించాం’ అని బోయింగ్ తెలిపింది.
ఇరానీయులే ఎక్కువ..
ప్రమాదం జరిగిన విమానంలో ఉక్రెయిన్ దేశస్థుల కంటే విదేశీయులే ఎక్కువగా ఉన్నారు. ప్రయాణికుల్లో 82 మంది ఇరానీయులు కాగా.. కెనడాకు చెందిన 63 మంది, స్వీడన్కు చెందిన 10, ఉక్రెయిన్కు చెందిన 11 మంది, అఫ్గాన్కు చెందిన నలుగురు, జర్మనీకి చెందిన ముగ్గురు, బ్రిటన్కు చెందిన ముగ్గురు ఉన్నారు. మరో తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు.
గాల్లోనే మంటలు..
విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం రాడార్తో సంబంధాలు తెగిపోయింది. దీనిపై ఇరాన్ స్పందిస్తూ.. విమానం కుప్పకూలిన తర్వాత మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయిందని చెప్పింది. అయితే ప్రమాదానికి సంబంధించిన వీడియోల్లో మాత్రం గాల్లో ఉండగానే విమానానికి నిప్పంటుకున్నట్లు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదం ఓ మిస్టరీగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!