బ్రిటన్ రాజకుటుంబంలో వేరుకుంపట్లు
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కుటుంబంలో మనస్పర్థలు వచ్చాయా..? ప్రిన్స్ విలియమ్, ప్రిన్స్ హ్యారీ దంపతులకు పొసగడం లేదా..? గత కొంతకాలంగా ఇంగ్లాండ్ సహా యావత్ ప్రపంచవాసులను తొలిచేస్తున్న ఈ
ప్రిన్స్ హ్యారీ, మేఘన్ల సంచలన నిర్ణయం
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కుటుంబంలో మనస్పర్థలు వచ్చాయా..? ప్రిన్స్ విలియమ్, ప్రిన్స్ హ్యారీ దంపతులకు పొసగడం లేదా..? గత కొంతకాలంగా ఇంగ్లాండ్ సహా యావత్ ప్రపంచవాసులను తొలిచేస్తున్న ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా ప్రిన్స్ హ్యారీ-మేఘన్ మర్కెల్ సంచలన ప్రకటన చేశారు. రాజకుటుంబం నుంచి తాము వేరుపడుతున్నామని, ఇకపై రాజకుటుంబంలో సీనియర్ సభ్యులుగా ఉండబోమని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని ఓ లేఖ ద్వారా రాణి ఎలిజబెత్కు వెల్లడించారు.
అటు ససెక్స్ రాయల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలోనూ వీరు సుదీర్ఘ, భావోద్వేగ పోస్ట్ చేశారు. ‘కొన్ని నెలలుగా ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఆర్థికంగా మేం స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాం. అందుకే ఇకపై రాజకుటుంబంలో సీనియర్ సభ్యులుగా ఉండబోం’ అని హ్యారీ, మేఘన్ పేర్కొన్నారు. ఇకపై తాము ఉత్తర అమెరికాలో సమయం గడుపుతామని, అయితే రాణి ఎలిజబెత్ 2కు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కాగా.. తమ కుమారుడిని మాత్రం రాజకుటుంబ సంప్రదాయాలతోనే పెంచుతామని వెల్లడించారు.
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2, తమ తండ్రి ప్రిన్స్ ఛార్లెస్కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ప్రిన్స్ హ్యారీ దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ సంచలన ప్రకటనతో రాణి ఎలిజబెత్ దిగ్భ్రాంతికి గురైనట్లు తెలుస్తోంది. అటు బకింగ్హమ్ ప్యాలెస్ కూడా హ్యారీ నిర్ణయంపై ఓ ప్రకటన చేసింది. అయితే దీనిపై హ్యారీ దంపతులతో చర్చలు జరుగుతున్నాయని దీనిలో పేర్కొంది. ‘ప్రిన్స్ హ్యారీ కోరికను మేం అర్థం చేసుకోగలం. కానీ, దీని వల్ల సమస్యలు రావొచ్చు’ అని బకింగ్హమ్ ప్యాలెస్ ప్రకటనలో తెలిపింది.
2018 మే నెలలో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఏడాది క్రితం వీరికి కుమారుడు ఆర్చీ పుట్టాడు. అయితే గత కొంతకాలంగా మీడియా ప్రతినిధుల కారణంగా రాజకుటుంబంలో మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ప్రిన్స్ హ్యారీ గతంలో బహిరంగంగానే మాట్లాడారు. తన సోదరుడు విలియమ్తో బంధంలో తనకు మంచితో పాటు చెడు రోజులు కూడా ఉన్నాయని అన్నారు. మీడియాలో వచ్చే ప్రతికూల కథనాలతో కూడా ఎంతో వేదనకు గురయ్యామన్నారు. ఇటీవల శాండ్రిగ్హమ్లో జరిగిన రాజకుటుంబ సంప్రదాయ క్రిస్మస్ వేడుకలకు కూడా ప్రిన్స్ హ్యారీ దంపతులు దూరంగా ఉన్నారు. మేఘన్ తల్లి డోరియా రాగ్లాండ్తో కలిసి వీరు క్రిస్మస్ జరుపుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!