
ప్రమాదంలో పిల్లలను కాపాడినందుకు తల్లికి శిక్ష
ఇంటర్నెట్ డెస్క్: అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ముందుగా ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని రక్షిస్తాం. తర్వాత ముఖ్యమైన వస్తువులేమైనా ఉంటే వాటిని భద్రంగా బయటికి తెచ్చుకుంటాం. కానీ, ఇందుకు విరుద్ధంగా ఓ తల్లి అగ్నిప్రమాదం నుంచి దేశ నాయకుల ఫొటోలను కాకుండా తన పిల్లలను కాపాడుకున్నందుకు ఆమె జైలు శిక్ష అనుభవించనుంది. ఇదేంటి వింతగా ఉంది అనుకుంటున్నారా.... అంతేమరి ఆ దేశ చట్టాల ప్రకారం ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ముందుగా ఆ దేశ నాయకుల ఫొటోలను రక్షించాలి...ఇంతకీ ఆ దేశం ఏంటనేగా మీ సందేహం... అదే ఉత్తర కొరియా, ఆ నాయకులు కిమ్ జోంగ్ ఉన్ కుటుంబసభ్యులు.
వివరాల్లోకి వెళితే... ఉత్తర కొరియాలోని నార్త్ హామ్గ్యాంగ్ ప్రావిన్స్లోని ఒన్సోంగ్ కౌంటీలో ఒక ఇంటిలో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ప్రమాద విషయం తెలిసి వారి తల్లి పరిగెత్తుకెళ్లి వారిని రక్షించింది. ఆ ప్రయత్నంలో వారు ఉంటున్న ఇల్లు పూర్తిగా దగ్థమయింది. అయితే ఆ మంటల్లో ఆ దేశ మాజీ నాయకులైన కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్ ఫొటోలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో దేశ నాయకుల ఫొటోలను మంటల నుంచి కాపాడలేకపోయినందుకు ఆమెపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె నేరం రుజువైతే 15 ఏళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఉత్తర కొరియా చట్టాల ప్రకారం కిమ్ కుటుంబంలో చనిపోయిన నాయకులను బతిన వారిగా భావిస్తూ వారి ఫొటోలను ఆ దేశంలో ప్రతి పౌరుడూ తమ ఇళ్లలో ప్రదర్శించాలి. వాటికంటే పైన మరే ఇతర ఫొటోలు ఉండకూడదు. ఎప్పుడూ వాటిని శుభ్రపరుస్తూ ఉండాలి. ఒక వేళ ఫొటోలను గౌరవించడం, భద్రపరచే విషయంలో లోపాలు జరిగితే శిక్షలు కఠినంగా ఉంటాయి. ఈ ఫొటోలను పరిశీలించేందుకు అప్పుడప్పుడు పోలీసులు తనీఖీలు నిర్వహిస్తుంటారు. అగ్నిప్రమాదాలు, వరదల వంటివి సంభవించినప్పుడు ఫొటోలను కాపాడుతూ ఎవరైనా పౌరులు చనిపోతే వారిని హీరోలుగా కీర్తిస్తారు. అయితే విచారణ జరుగుతున్నందున ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను చూసేందుకు కూడా పోలీసులు వారి తల్లిని అనుమతించలేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nagababu: దయచేసి అందరూ ఇలా చేయండి: నాగబాబు
-
Related-stories News
National News: యూపీలో తామ్రయుగ ఆయుధాలు
-
Politics News
Atmakur bypoll: ఆత్మకూరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.. దూసుకెళ్తోన్న వైకాపా అభ్యర్థి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Related-stories News
National News: భార్యకు కానుకగా చంద్రుడిపై స్థలం
-
Ts-top-news News
Telangana News: ఆ విద్యార్థుల సర్దుబాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్ఖాన్ని వదులుకున్నా!
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్స్టేషన్లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- AP Liquor: మద్యంలో విషం
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-06-2022)
- Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్