పడవ మునిగి 11 మంది మృతి

టర్కీ: టర్కీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ మునిగి 11 మంది మృతి చెందారు. వీరిలో 8 మంది...

Updated : 12 Jan 2020 05:17 IST

టర్కీ: టర్కీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ మునిగి 11 మంది మృతి చెందారు. వీరిలో 8 మంది చిన్నారులు ఉన్నారు. ఈ సంఘటన పశ్చిమ టర్కీలోని ఈజియన్‌ ప్రావిన్స్‌ ఇజ్మీర్‌ తీరంలో చోటుచేసుకున్నట్లు టర్కీ కోస్టు గార్డ్డ్‌ వర్గాలు తెలిపాయి. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 19 మంది ప్రయాణిస్తున్నారు. పడవ ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న టర్కీ కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది ఎనిమిది మందిని రక్షించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని