అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గినట్లేనా..?
గత పది రోజులుగా అమెరికాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలకాలని ఇరాన్ యోచిస్తున్నట్లు ఆదివారం సంకేతాలు వెలువడ్డాయి. మరోవైపు చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని...........
టెహ్రాన్: గత పది రోజులుగా అమెరికాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలకాలని ఇరాన్ యోచిస్తున్నట్లు ఆదివారం సంకేతాలు వెలువడ్డాయి. మరోవైపు చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని అమెరికా తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరాన్ మేజర్ జనరల్ సులేమానీ హత్య తరవాత పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు సద్దుమణిగే సూచనలు కనిపిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్ ఎస్పర్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ ఇరాన్తో చర్చలకు సిద్ధంగానే ఉన్నారని ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా ఇరాన్తో సమావేశానికి అమెరికా ఆసక్తి చూపుతున్నప్పటికీ.. ఆంక్షలు ఎత్తివేస్తేనే తాము చర్చలకు వస్తామని ఇరాన్ వాదిస్తోందన్నారు. ఇరాన్తో ఒప్పందానికి తానెప్పుడూ సిద్ధమేనని ట్రంప్ సైతం పలుసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు ఆదివారం ఇరాన్ అధ్యక్షడు హసన్ రౌహానీతో భేటీ అయిన ఖతార్ రాజు షేక్ తామిమ్ బిన్ హమద్ అల్-థానీ.. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు సద్దుమణగాలంటే తాజా ఉద్రిక్తతలకు స్వస్తి పలకాలన్న విధానానికి ఇరాన్ అంగీకరించిందని వెల్లడించారు. పశ్చిమాసియా ప్రాంత భద్రతను దృష్టిలో ఉంచుకొని మరింత విస్తృత స్థాయి సంప్రదింపులు, సహకారాన్ని కొనసాగించేందుకు రౌహానీ అంగీకరించారన్నారు. అలాగే బుధవారం అమెరికా స్థావరాలపై ఐఆర్జీసీ జరిపిన క్షిపణి దాడులు అక్కడి సైనికుల్ని చంపాలనే ఉద్దేశంతో చేయలేదని కమాండర్ హుస్సేన్ సలామీ వివరించడం గమనార్హం.
మరోవైపు ఉక్రెయిన్ విమానాన్ని పొరపాటున తామే కూల్చామని ఇరాన్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశంలో ఆందోళనలు చెలరేగాయి. వీటిని అదుపు చేసే క్రమంలోనే ఇరాన్ పోలీసులు బ్రిటన్ రాయబారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అంతర్జాతీయ సమాజం నుంచి ఇరాన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలోనూ ఇరాన్ వెనక్కి తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. అంతర్గత ఆందోళనలు, అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోందని అభిప్రాయపడ్డారు. ఇక చర్చలకు రావాల్సిన తప్పనిసరి పరిస్థితులు తలెత్తాయన్నారు. ఇరాన్తో ఒప్పందానికి తాను సిద్ధంగానే ఉన్నానన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య