కశ్మీర్‌లో హిమపాతం: ఎనిమిది మంది మృతి

మచిల్‌: జమ్మూకశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని మచిల్‌ సెక్టార్‌లో హిమపాతం బీభత్సం సృష్టించింది. ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై మంచుచరియలు విరిగిపడటంతో ముగ్గురు జవాన్లు మృతి చెందగా మరో జవాను గల్లంతయ్యాడు. గాయపడిన మరో జవాను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు.

Published : 15 Jan 2020 00:56 IST

మచిల్‌: జమ్మూకశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని మచిల్‌ సెక్టార్‌లో హిమపాతం బీభత్సం సృష్టించింది. ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై మంచు చరియలు విరిగిపడటంతో ముగ్గురు జవాన్లు మృతి చెందగా మరో జవాను గల్లంతయ్యాడు. గాయపడిన మరో జవాను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు. గల్లంతైన జవాను కోసం ఆర్మీ, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. రహదారులపై తీవ్రంగా మంచు పేరుకుపోయి ఉండటంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సిబ్బంది విమానాల ద్వారా ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

సోన్‌మార్గ్‌లో సోమవారం సంభవించిన హిమపాతంతో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న మరో తొమ్మిది మందిని భద్రతా బలగాలు సురక్షితంగా రక్షించాయి. భారీగా కురుస్తున్న మంచు కారణంగా గత 48 గంటల్లో నార్త్‌ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదాల్లో చిక్కుకున్న జవాన్లను సిబ్బంది రక్షించారు. నిన్న బారాముల్లా జిల్లాలో మంచుచరియల కింద చిక్కుకుపోయిన ఇద్దరు యువతులను స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు. లద్దాఖ్‌, జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ అధికారులు హిమపాతం జరిగే ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని