నిర్భయ దోషుల ఉరి మరింత ఆలస్యం?
నిర్భయ కేసులో దోషులకు మరణ శిక్షను అమలు చేయాలని ఆదేశిస్తూ జారీ చేసిన డెత్ వారెంట్లో పేర్కొన్నట్లుగా.. జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయడం సాధ్యం కాదని దిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.......
దిల్లీ: నిర్భయ కేసులో దోషులకు మరణ శిక్షను అమలు చేయాలని ఆదేశిస్తూ జారీ చేసిన డెత్ వారెంట్లో పేర్కొన్నట్లుగా.. జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయడం సాధ్యం కాదని దిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మరణశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ దోషులు ముకేశ్ సింగ్, వినయ్ శర్మ పెట్టుకున్న క్యురేటివ్ పిటిషన్ను మంగళవారం సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో క్షమాభిక్ష కోరుతూ ముకేష్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు అభ్యర్థన సమర్పించాడు. అలాగే రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు మరణశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో జైలు నిబంధనల ప్రకారం.. క్షమాభిక్షపై రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు ఉరిశిక్ష అమలు చేయలేమని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంగీత ధింగ్రా సెహగల్కు దిల్లీ ప్రభుత్వం వివరించింది.
మరోవైపు, ఒకవేళ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించినా.. నిబంధనల ప్రకారం దోషులను ఉరితీయడానికి ముందు కనీసం 14 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని తీహాడ్ జైలు అధికారులు కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో నలుగురు దోషుల ఉరిశిక్ష మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?