చివరి కోరిక చెప్పని నిర్భయ దోషులు

ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేకెత్తించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు చివరి సమయం ఆసన్నమైంది. ఈ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయడానికి తిహాడ్‌ జైల్లో ఏర్పాట్లు

Updated : 23 Jan 2020 14:39 IST

దిల్లీ: ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేకెత్తించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు చివరి సమయం ఆసన్నమైంది. ఈ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయడానికి తిహాడ్‌ జైల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఉరిశిక్ష అమలు దగ్గరపడుతుండటంతో చివరి కోరికలు ఏమైనా ఉన్నాయా అని అధికారులు దోషులను అడగ్గా.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదట. ఈ విషయాన్ని తిహాడ్‌ జైలు వర్గాలు వెల్లడించాయి. 

నిబంధనల ప్రకారం.. మరణశిక్ష పడిన దోషులు చివరి కోరికగా తమ కుటుంబసభ్యులను కలుసుకోవాలని అడగొచ్చు. వారి ఆస్తులను తమకిష్టమైన వారికిచ్చేలా ఏర్పాట్లు చేసుకోవచ్చు. అయితే ఈ రెండు విషయాల పై జైలు అధికారులు నిర్భయ దోషులను అడగ్గా.. వారు మౌనంగా ఉన్నారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఉరిశిక్ష అమలు మళ్లీ వాయిదా పడుతుందని దోషులు ధీమాగా ఉన్నట్లు కన్పిస్తోందని జైలు వర్గాలు చెబుతున్నాయి. 

నిజానికి బుధవారమే ఈ నలుగురు దోషులను ఉరితీయాల్సి ఉండగా.. క్షమాభిక్ష అభ్యర్థన రూపంలో ఆటంకం ఏర్పడిన విషయం తెలిసిందే. దోషుల్లో ఒకడైన ముఖేశ్‌ రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకోవడంతో వీరి శిక్ష అమలు తేదీ వాయిదా పడింది. అయితే ముఖేశ్ అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడంతో దిల్లీ కోర్టు కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసింది. దోషులను ఫిబ్రవరి 1, ఉదయం 6 గంటలకు ఉరితీయాలని అధికారులను ఆదేశించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని