నిర్భయ దోషుల పిటిషన్లు కొట్టివేత
నిర్భయ దోషుల తరఫు న్యాయవాది వేసిన పిటిషన్ను దిల్లీ కోర్టు కొట్టేసింది. దోషులు క్షమాభిక్ష, క్యురేటివ్ పిటిషన్లు వేసుకునేందుకు అవసరమైన పత్రాలను తీహాడ్ జైలు అధికారులు ఇవ్వలేదని ఆరోపిస్తూ వాళ్ల తరఫున న్యాయవాది ఏపీ సింగ్ నిన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్పై
దిల్లీ: నిర్భయ దోషుల తరఫు న్యాయవాది వేసిన పిటిషన్ను దిల్లీ కోర్టు కొట్టేసింది. దోషులు క్షమాభిక్ష, క్యురేటివ్ పిటిషన్లు వేసుకునేందుకు అవసరమైన పత్రాలను తీహాడ్ జైలు అధికారులు ఇవ్వలేదని ఆరోపిస్తూ వాళ్ల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ నిన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై శనివారం దిల్లీ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి అజయ్ కుమార్ జైన్ విచారణ జరిపారు. వినయ్కు సంబంధించిన డైరీ, పెయింటింగ్స్ను తీహాడ్ జైలు అధికారులు తనకు ఇవ్వలేదని దోషుల తరఫు న్యాయవాది ఆరోపించారు. దిల్లీ పోలీసుల తరఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ దోషుల తరఫు న్యాయవాదికి అవసరమైన అన్ని పత్రాలను తీహాడ్ జైలు అధికారులు అందించినట్లు న్యాయస్థానానికి తెలియజేశారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు వాళ్లు ఇటువంటి పిటిషన్లు వేసి సమయాన్ని వృథా చేస్తున్నారని పేర్కొన్నారు. తీహాడ్ జైలు అధికారులతో న్యాయస్థానం ఏకీభవించింది.
తొలుత దోషుల తరఫున హాజరైన న్యాయవాది ఏపీ సింగ్ తన వాదనలను వినిపించారు. నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మపై విష ప్రయోగం జరిగిందని ఆయన ఆరోపించారు. అందుకే అతడిని ఆస్పత్రిలో చేర్పించారని.. కానీ దీనికి సంబంధించిన ఎటువంటి మెడికల్ రిపోర్టులను అధికారులు ఇవ్వలేదని కోర్టుకు తెలియజేశారు. ప్రస్తుతం వినయ్ మానసిక పరిస్థితి బాగోలేదని తెలిపారు. అతడు జైల్లో ఆహారం కూడా తీసుకోవడం లేదని కోర్టుకు తెలియజేశారు. అధికారులు అతడి మెడికల్ రిపోర్టులు ఇస్తే క్షమాభిక్ష పెట్టుకునేందుకు ఉపయోగపడతాయని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తెలిపింది.
తీహాడ్ జైలు అధికారులు దోషులకు సంబంధించిన పత్రాలు ఇవ్వడం ఆలస్యం చేయడం వల్లే వినయ్ కుమార్ క్షమాభిక్ష, అక్షయ్కుమార్, పవన్ సింగ్ క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేయలేకపోయారని ఆరోపిస్తూ వాళ్ల తరఫు న్యాయవాది నిన్న దిల్లీ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. గతంలో వినయ్, ముకేశ్ సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసుకోగా దాన్ని తిరస్కరించారు. దీంతో ముకేశ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ దరఖాస్తు చేసుకోగా అది తిరస్కరణకు గురైంది. ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు నలుగురు దోషులను ఉరితీయాల్సిందిగా దిల్లీ కోర్టు ఇటీవల డెత్ వారెంట్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం