‘సీఏఏ మా అంతర్గతం’

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఐరోపా సమాఖ్య(ఈయూ)లో చర్చ జరపనుండడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సభ్యులు చేత ఆమోదం పొందిన ఓ...........

Updated : 21 Dec 2022 17:14 IST

చట్టంపై ఈయూలో చర్చ చేపట్టనుండడాన్ని ఖండించిన భారత్‌

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఐరోపా సమాఖ్య(ఈయూ)లో చర్చ చేపట్టనుండడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సభ్యుల చేత ఆమోదం పొందిన ఓ చట్టాన్ని ప్రశ్నించడం సరైన చర్య కాదని స్పష్టం చేసింది. ఈ అంశం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పింది. రెండు సభల్లో సవివర చర్చ అనంతరం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సభ్యులు చట్టానికి ఆమోదం తెలిపారని గుర్తుచేసింది. తీర్మానాలు ప్రవేశపెట్టిన సభ్యులు తొలుత భారత్‌తో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం హితవు పలికింది. చట్టంపై పూర్తి అవకగాహన ఏర్పరచుకోవాలని సూచించింది. 

సీఏఏకి వ్యతిరేకంగా ఈయూలోని పలువురు సభ్యులు తీర్మానాలు ప్రవేశపెట్టారు. వాటిపై ఈ బుధవారం ఈయూ పార్లమెంట్‌ చర్చ చేపట్టనుంది. తర్వాత రోజు ఈ తీర్మానాలపై ఓటింగ్‌ నిర్వహించనున్నారు. సీఏఏ వివక్షపూరితంగా ఉందని.. దీనిపై ఆందోళనలు చేస్తున్న వారితో ప్రభుత్వం చర్చలు జరిపాలని తీర్మానాల్లో పేర్కొన్నారు. సీఏఏ వల్ల ఏ ఒక్కరి పౌరసత్వం రద్దు కాదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది ఏ వర్గంపైనా వివక్ష చూపదని స్పష్టం చేసింది. అయినా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు