ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన షార్జిల్
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన జేఎన్యూ పీహెచ్డీ విద్యార్థి షార్జిల్ ఇమామ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. షార్జిల కోసం గత నాలుగు రోజులుగా గాలింపు చేపట్టిన దిల్లీ
దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన జేఎన్యూ పీహెచ్డీ విద్యార్థి షార్జిల్ ఇమామ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. షార్జిల కోసం గత నాలుగు రోజులుగా గాలింపు చేపట్టిన దిల్లీ పోలీసులు.. బిహార్లోని జెహనాబాద్ ప్రాంతంలో మంగళవారం అరెస్టు చేశారు.
సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న షార్జిల్.. అసోం, ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేయాలంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవడంతో దిల్లీ పోలీసులు అతడిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. అసోం, ఉత్తర్ప్రదేశ్, మణిపూర్, బిహార్, అరుణాచల్ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ అతడిపై కేసులు నమోదయ్యాయి.
అయితే ఈ వీడియో వెలుగులోకి వచ్చిన నాటి నుంచి షార్జిల్ కనబడకుండా పోయాడు. దీంతో అతడి కోసం దిల్లీ క్రైం బ్రాంచ్ ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేసింది. రాజధానితో పాటు ముంబయి, పట్నా ప్రాంతాల్లోనూ గాలించింది. మరోవైపు అతడి కుటుంబసభ్యులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరిపింది. ఎట్టకేలకు నేడు తన సొంత పట్టణమైన జెహనాబాద్ నుంచి షార్జిల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. దిల్లీలో ఉద్రిక్తంగా జరుగుతున్న షహీన్బాగ్ ధర్నాకు షార్జిల్ కూడా ఒక నిర్వాహకుడని ఆరోపణలున్నాయి. అయితే షార్జిల్ వ్యాఖ్యలకు షహీన్బాగ్ నిరసనకారులు దూరంగా ఉన్నారు. అంతేగాక, ఈ ఆందోళనకు ఏ ఒక్కరు కూడా నిర్వాహకుడిగా ఉండరని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!