వామ్మో చైనా వాళ్లా..!
చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఆదేశంపై అంతర్జాతీయంగా విద్వేషం పెరిగేలా చేస్తోంది. ఆ విష మహమ్మారి ఇతర దేశాలకూ వ్యాపిస్తుండటమే విద్వేషానికి కారణం. పలు దేశాల్లో చైనీయులకు వ్యతిరేకంగా జాతి వివక్ష జ్వాలలు ఎగసిపడుతున్నాయి.
కరోనాతో చైనీయులపై రగులుతున్న విద్వేషం
సియోల్: చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్ ఆదేశంపై అంతర్జాతీయంగా విద్వేషం పెరిగేలా చేస్తోంది. ఆ విష మహమ్మారి ఇతర దేశాలకూ వేగంగా వ్యాపిస్తుండటమే విద్వేషానికి కారణం. పలు దేశాల్లో చైనీయులకు వ్యతిరేకంగా వివక్ష జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఆ దేశస్థుల పర్యటనలు నిషేధించడం, వారిని రెస్టరెంట్లలోకి రానివ్వకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. చైనీయులు మాత్రమే కాకుండా పలు ఆసియా ప్రాంతాలకు చెందిన వారిపైనా ఈ ప్రభావం పడుతుండటం గమనార్హం. ఇప్పటికే దక్షిణ కొరియా, జపాన్, హాంగ్కాంగ్, వియత్నాంలోని రెస్టరెంట్లు చైనీస్ కస్టమర్లను నిరాకరిస్తున్నారు. మరోవైపు ఐరోపా, యూఎస్లోనూ చైనా సహా ఇతర ఆసియా దేశాల వారు కరోనా కారణంగా వివక్షను ఎదుర్కొంటున్నారు.
చైనీయులకు వ్యతిరేకంగా 6లక్షల మంది
చైనీయుల ఆహారపు అలవాట్ల గురించి ప్రచారం చేస్తున్న వ్యాఖ్యలను నివారించాలని పలువురు చైనీయులు దక్షిణకొరియా ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. అదేవిధంగా సియోల్లోని ప్రముఖ సీఫుడ్ రెస్టరెంట్ చైనీయులకు ప్రవేశం లేదని బోర్డు పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. చైనా పర్యాటకులను నిరాకరించాలని 6లక్షల మంది దక్షిణకొరియా పౌరులు ప్రభుత్వానికి దరఖాస్తు చేయడం గమనార్హం. దాదాపు 30 మంది అందుకు నిరసనగా బ్లూహౌజ్ వద్ద బుధవారం ర్యాలీ ప్రదర్శన సైతం నిర్వహించారు.
పలు చోట్ల ఆహారానికీ నిరాకరణ
హాంకాంగ్లో పలు హోటళ్లలో చైనీయులకు ఆహారం సరఫరా చేసేందుకు నిరాకరిస్తున్నారు. ‘మేము ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నాం. స్థానిక కస్టమర్ల కోసం మిమ్మల్ని నిరాకరిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి’ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. డానిష్కు చెందిన మరో వార్తా పత్రిక చైనా జాతీయ పతాకంలోని చుక్కలతో వైరస్ కార్టూన్ను ప్రచురించింది. దీనిపై చైనా దౌత్య కార్యాలయం స్పందిస్తూ.. తమ దేశాన్ని కించపరచడం తగదని క్షమాపణలు చెప్పాలని కోరింది. ఇలా పలు చోట్ల వారిపై వివక్ష రేకెత్తుతుండటం వారి దయనీయ పరిస్థితిని స్పష్టం చేస్తోంది.
చైనాలో కాకుండా దాదాపు 24 దేశాల్లో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఫిలిప్పీన్స్లో మాత్రం ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దీని ధాటికి చైనాలో మొత్తం 304 మంది మరణించగా.. వేలాది మంది దీని బారిన పడ్డారు. చాలా దేశాలు వుహాన్కు ప్రత్యేక విమానాలు పంపించి అక్కడి నుంచి తమ దేశాలకు చెందిన వారి వెనక్కి రప్పించుకుంటున్నాయి. అంతేకాకుండా ఈ పరిణామాలు చైనాకు వాణిజ్య, రాజకీయ, దౌత్య పరంగా వివాదాలుగా మారుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే