ఇజ్రాయెల్తో హెచ్ఏఎల్ ఒప్పందం
మానవరహిత విమానాల(యూఏవీ) తయారీ కోసం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్(ఐఏఐ)తో కలిసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్), డైనమెటిక్ టెక్నాలజీస్ లిమిటెడ్(డీటీఎల్) ఒప్పందం కుదుర్చుకున్నాయి........
సంయుక్త భాగస్వామ్యంలో యూఏవీల తయారీ
లఖ్నవూ: మానవరహిత విమానాల (యూఏవీ) తయారీ కోసం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ)తో కలిసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), డైనమెటిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ (డీటీఎల్) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంలో భారత భద్రతా బలగాలకు అవసరమైన యూఏవీలను తయారుచేయనున్నారు. లఖ్నవూలో బుధవారం ప్రారంభమైన డిఫెన్స్ ఎక్స్పో-2020 సందర్భంగా ఈ ఒప్పందం ఖరారైంది. తాజా ఒప్పందంతో సైనిక ఉత్పత్తుల తయారీలో హెచ్ఏఎల్ సామర్థ్యం పెరిగే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.మాధవన్ తెలిపారు. అలాగే ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక సాంకేతికత సమకూర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. ‘భారత్లో తయారీ’లో భాగంగానే ఈ ఒప్పందం కుదిరిందన్నారు. భవిష్యత్లో భారీ ఎత్తున యూఏవీలను భారత్ సైన్యంలో చేర్చేందుకు హెచ్ఏఎల్ యోచిస్తోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని