ఎడారిలా వీధులు.. జనమంతా ఆస్పత్రుల్లో..!
చైనాలో విజృంభించిన ‘కరోనా’ తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది. అంతుబట్టని ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా మొత్తం 565 మంది మృతిచెందినట్టు చైనా వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది........
వుహాన్లో పరిస్థితి ఎలా ఉందంటే..?
ఇంటర్నెట్ డెస్క్: చైనాలో ‘కరోనా’ తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది. అంతుబట్టని ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా మొత్తం 565 మంది మృతిచెందినట్టు చైనా వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. డిసెంబర్ నెలాఖరు నుంచి ఇప్పటివరకు 25కి పైగా దేశాలకు వ్యాపించిన ఈ ‘కరోనా’తో బాధితుల సంఖ్య 28,339కి చేరింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ వైరస్ భయంతో వణుకుతున్నాయి. గురువారం ఒక్కరోజే హుబేయి ప్రావిన్స్లో సుమారు 70 మంది మృతి చెందగా.. కొత్తగా 3,156 కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఈ వైరస్ పుట్టిన వుహాన్ నగరంలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అక్కడి పరిస్థితిపై వుహాన్లోని హాంకాంగ్ ఆర్థిక, వాణిజ్య కార్యాలయ డైరెక్టర్ విన్సెంట్ ఫంగ్ తన ఫేస్బుక్లో పలు అంశాలను ఇలా వివరించారు. ‘‘వుహాన్ వీధులన్నీ ఎడారుల్లా ఉన్నాయి. ఆస్పత్రులన్నీ జనంతో నిండిపోయాయి. . నిత్యావసర సరుకులు పొందడంలో మాత్రం ఇంకా పెద్దగా సమస్య ఏర్పడలేదు.. సూపర్మార్కెట్లు, ఔషధ దుకాణాలు తెరిచే ఉన్నాయి. వస్తువుల సరఫరా సరిగానే ఉంది. కానీ ధరే కాస్త ఎక్కువ. ఎక్కువ మంది ప్రజలు ఇళ్లల్లోనే చిక్కుకుపోయారు.. కానీ ఈ మహమ్మారిని తరిమికొట్టే యుద్ధానికి మాత్రం ప్రజలు ఎంతో ఐక్యతతో వ్యవహరిస్తున్నారు’’ అని వివరించారు.
బయో ఆయుధం ఆరోపణలపై..
వుహాన్లో రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేసినప్పుడు అమెరికా ప్రభుత్వం అక్కడ జీవాయుధాన్ని వదిలి వెళ్లిందంటూ ఆన్లైన్లో చెలరేగుతున్న ఊహగానాలపై ఫంగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘అమెరికా కాన్సులేట్ కార్యాలయం, మా కార్యాలయం ఒకే బ్లాక్లో ఉన్నాయి. వాళ్లు ఒకవేళ ఏదైనా జీవ ఆయుధాలను ఇక్కడ వదిలి వెళ్తే మేం విషపూరితమై చనిపోయేవాళ్లం’’ అని అన్నారు.
అది హాంకాంగ్కు పెద్ద తలనొప్పే..
చైనాలోని హుబేయి ప్రావిన్స్లో 2వేల మందికి పైగా హాంకాంగ్ వాసులు చిక్కుకున్నారనీ.. వారిని స్వస్థలానికి తీసుకురావడం పెద్ద తలనొప్పిగా మారిందని విన్సెంట్ ఫంగ్ అన్నారు. వుహాన్లో చిక్కుకుపోయిన చాలామంది హాంకాంగ్ పౌరులు తమ ప్రాంతానికి వెళ్లాలని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒంటరిగా ఉండేవారిని తీసుకొచ్చేందుకు హాంకాంగ్లోని తన మిత్రులు ప్రయత్నాలు చేస్తున్నారనీ.. కానీ ఈ ప్రావిన్స్లో చెల్లా చెదురుగా ఉన్న పెద్ద సంఖ్యలో ఉన్నవారిని తీసుకెళ్లడం మాత్రం పెద్ద సవాలేనన్నారు. వుహాన్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ‘‘ఇది నిజంగా చాలా పెద్ద తలనొప్పి.. హాంకాంగ్ ప్రజల సహకారం కోసం మేం ఫోన్, వియ్చాట్, ఈమెయిల్, ఇతర మాధ్యమాల ద్వారా వారికి సమాచారాన్ని అప్డేట్ చేస్తున్నాం. హాంకాంగ్లోని అన్ని డిపార్ట్మెంట్లతో టచ్లో ఉన్నాం. మా బృందం నిరంతరాయంగా పనిచేస్తూనే ఉందన్నారు. ఈ రోజు తేదీ ఏదో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
కోలుకోవడంతో ఇద్దరి డిశ్చార్జి
మరోవైపు ఈ ప్రాణాంతక మహమ్మారి సోకిన వారిలో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. థాయ్లాండ్లో చైనా ప్రయాణికులను తన కారులో ఎక్కించుకున్న 50 ఏళ్ల ట్యాక్సీ డ్రైవర్కు కరోనా సోకగా.. వైద్యులు అతడికి నిరంతరం పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించడంతో కోలుకున్నాడు. అలాగే తైవాన్లో కూడా 55 ఏళ్ల మహిళ ఈ వైరస్ బారినపడి ఆస్పత్రిలో చేరి పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జి అయినట్టు తైవాన్ ఆరోగ్య మంత్రి వెల్లడించారు.
వీసాలు రద్దు చేసిన తైవాన్
కరోనా విజృంభన నేపథ్యంలో తైవాన్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. హాంకాంగ్, మకావు, చైనా నుంచి వచ్చిన భారీ నౌకలు తమ వద్ద నిలపకుండా నిషేధం విధించింది. అలాగే, హాంకాంగ్, మకావు నుంచి వచ్చే పౌరులకు ఆన్లైన్, ల్యాండింగ్ వీసాల జారీని నిరవధికంగా రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ ఇది అమలులో ఉంటుందని తెలిపింది. ఈ నెల 29 వరకు పర్యటనలకు అనుమతించబోమని ఆ దేశ పర్యాటక శాఖ ప్రకటించింది. తైవాన్లో ఇప్పటిదాకా వైరస్ బాధితుల సంఖ్య 13కి చేరింది.
భారత్లో ఇప్పటిదాకా కేరళలోనే మూడు కేసులు నమోదు కాగా.. దేశంలోని పలుచోట్ల ‘కరోనా’ అనుమానితులు ఆస్పత్రుల్లో చేరి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత్ ఫిబ్రవరి 5కు ముందు జారీ చేసిన చైనా, ఆ దేశం నుంచి వచ్చే విదేశీయులకు జారీచేసిన వీసాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలోనూ కరోనా పరీక్షల కోసం 10 మంది చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు