గెలిచేది మేమే.. రాసి పెట్టుకోండి: భాజపా

దిల్లీలో శాసనసభ ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్స్‌ వెలువడిన కొద్ది సేపటికే భాజపా చీఫ్‌ మనోజ్‌ తివారీ స్పందించారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజున నేటి ఎగ్జిట్‌పోల్స్‌ విఫలమవుతాయని..

Published : 09 Feb 2020 01:02 IST

దిల్లీ: దిల్లీలో శాసనసభ ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు వెలువడిన కొద్ది సేపటికే భాజపా దిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ స్పందించారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజున ఇవాల్టి ఎగ్జిట్‌పోల్స్‌ విఫలమవుతాయని, భాజపా మెజారిటీతో గెలుస్తుందని ట్వీట్‌ చేశారు. ‘ఇప్పుడు వెలువడిన అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల రోజున విఫలమవుతాయి. కావాలంటే ఈ ట్వీట్‌ను సేవ్‌ చేసి పెట్టుకోండి. 48 స్థానాలతో దిల్లీలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత ఈవీఎంలపై ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించవద్దు’ అని తివారీ ట్వీట్‌లో పేర్కొన్నారు. శనివారం దిల్లీ శాసనసభకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. అన్నింటిలోనూ దాదాపు ఆప్‌కే ఫలితాలు అనుకూలంగా ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని