జపాన్ నౌకలోభారతీయుల పరిస్థితి ఏంటి?
జపాన్కు చెందిన విహార నౌక ‘డైమండ్ ప్రిన్సెస్’లో కరోనా సోకిన వారి సంఖ్య 64కు చేరింది. శనివారం మరో ముగ్గురు ఈ వైరస్ బారిన పడ్డట్లు గుర్తించారు. గత కొన్ని రోజులుగా.......
దిల్లీ: జపాన్కు చెందిన విహార నౌక ‘డైమండ్ ప్రిన్సెస్’లో కరోనా సోకిన వారి సంఖ్య 64కు చేరింది. శనివారం మరో ముగ్గురు ఈ వైరస్ బారిన పడ్డట్లు గుర్తించారు. గత కొన్ని రోజులుగా యొకొహామ పోర్టులోనే నిలిచిపోయిన ఈ నౌకలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. దీనిలో భారతీయులు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, వారెవరికీ వ్యాధి సోకలేదని విదేశాంగమంత్రి జైశంకర్ శనివారం స్పష్టం చేశారు. నౌకలో మొత్తం 138 మంది భారతీయులు ఉన్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది. వీరిలో 132 మంది సిబ్బంది కాగా.. మరో ఆరుగురు ప్రయాణికులు. ఈ నేపథ్యంలో నౌకలోకి సైన్యాన్ని పంపాలని జపాన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. నౌక నిర్వహణ కోసం లేదా ప్రయాణికుల్ని అక్కడి నుంచి తరలించడం కోసమో సైన్యాన్ని రంగంలోకి దింపే అవకాశం ఉందని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ నౌకలో పనిచేసే వినయ్ కుమార్ సర్కార్ ఫేస్బుక్లో ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. తమను ఎలాగైనా రక్షించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. శనివారం మరో భారతీయుడు తమ కుటుంబ సభ్యులతో వీడియో కాల్లో మాట్లాడాడు. కర్ణాటకలోని కార్వార్కు చెందిన 26 ఏళ్ల యువకుడు నౌకలో ‘స్టీవార్డు’గా పనిచేస్తున్నాడు. భారత ప్రభుత్వ సాయంతో తమని బయటకు తెచ్చేలా చూడాలంటూ కుటుంబ సభ్యులకు కోరాడు. అయితే నౌక యాజమాన్య కంపెనీ ప్రతినిధులు ‘కార్నివాల్ కార్పొరేషన్ అండ్ పీఎల్సీ’ కూడా సదరు యువకుడి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎవరికీ ఎలాంటి అపాయం జరగదని హామీ ఇచ్చినట్లు సమాచారం. నౌకలో ఉన్న భారతీయుల్లో చాలా మంది ముంబయి, కేరళ, గోవాకు చెందినవారని తెలిసింది. మరోవైపు ఇటు భారత్లో ఉన్న వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఫిబ్రవరి 19తో వారి వైద్యపర్యవేక్షణ సమయం పూర్తవుతుందని సమాచారం. అప్పటి వరకు వారు వేచిచూడక తప్పదని తెలుస్తోంది. జపాన్లో అత్యాధునిక వసతులు ఉన్నా.. వైరస్ సోకే ప్రమాదకర ప్రదేశంలో మిగిలిన వారిని కూడా ఉంచాల్సిన అవసరం ఏంటని భారతీయులు ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.