భాజపా జాతీయవాదానికి తెలివిగా చెక్‌..

భాజపా జాతీయవాదానికి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  కేజ్రీవాల్‌ తెలివిగా చెక్‌పెట్టారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో బాలాకోట్‌పై ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తే..

Published : 11 Feb 2020 19:36 IST

దిల్లీ: భాజపా జాతీయవాదానికి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  కేజ్రీవాల్‌ తెలివిగా చెక్‌పెట్టారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో బాలాకోట్‌పై ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తే.. పాక్‌ భాష మాట్లాడుతున్నాయంటూ ప్రధాని మోదీ విమర్శించారు. ఇవి ప్రజలపై బలంగానే పనిచేశాయి. ఆ ప్రభావం ప్రతిపక్షాల సీట్లపై పడింది. ఈ సారి దిల్లీ ఎన్నికల సమయంలో పాక్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కానీ, కేజ్రీవాల్‌ లౌక్యంగా తప్పించుకొని పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొన్నారు.    

పాక్‌ మంత్రి ఫవాద్‌ చౌదురి దిల్లీ ఎన్నికల్లో ఆప్‌ గెలవాలంటూ ట్వీట్‌ పెట్టారు. భాజపా దీనిని ఆయుధంగా చేసుకొని జాతీయ వాదాన్ని ఎన్నికల ప్రచారంలోకి చొప్పించే ప్రయత్నం చేసింది. దీనిలో భాజపా సఫలమైతే జరిగే నష్టమేమిటో సార్వత్రిక ఎన్నికల్లో కేజ్రీవాల్‌ రుచి చూశారు. అందుకే ఆయన కొంచెం తెలివిగా వ్యవహరించి ఫవాద్‌ చౌదురికి ఘాటుగా సమాధానం ఇచ్చారు.  ‘మోదీ భారతావనికి ప్రధానమంత్రి, నాకూ ఆయనే ప్రధాని. దిల్లీ ఎన్నికలు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారం. ఉగ్రవాదాన్ని పెద్దయెత్తున పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ మా దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు’ అంటూ సమాధానమిచ్చారు. ఈ  ప్రతిస్పందనకు భాజపా సానుభూతిపరులు కూడా ముగ్ధులైపోయారు. రాజకీయంగా ఆయన చూపిన పరిణతి ఓట్లు చేజారి పోకుండా చేసింది. అదే సమయంలో సీఏఏపై, షాహీన్‌ బాగ్‌లో  జరుగుతున్న ఆందోళనలకు దూరంగా ఉండటం కూడా కలసివచ్చింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని