‘చేతులెత్తి మొక్కుతున్నా.. వారిని ఉరితీయండి’
‘మేమూ మనుషులమే.. ఏడేళ్లయింది, నా కూతురికి ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది. మీకు చేతులెత్తి మొక్కుతున్నా.. దయచేసి దోషులను ఉరితీయండి’ అని నిర్భయ తల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నిర్భయ దోషుల ఉరితీతకు
కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న నిర్భయ తల్లి
దిల్లీ: ‘మేమూ మనుషులమే. ఏడేళ్లయింది. నా కూతురికి ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది. మీకు చేతులెత్తి మొక్కుతున్నా.. దయచేసి దోషులను ఉరితీయండి’ అని నిర్భయ తల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నిర్భయ దోషుల ఉరితీతకు కొత్త తేదీని నిర్ణయించవచ్చని సుప్రీంకోర్టు నిన్న కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషుల శిక్ష అమలుకు కొత్త డెత్ వారెంట్లు జారీ చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు, దిల్లీ ప్రభుత్వం దిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది.
అయితే తన తరఫున వాదించేందుకు న్యాయవాది ఎవరూ లేరంటూ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా కోర్టుకు విన్నవించాడు. దీంతో అతడి తక్షణమే కోర్టు న్యాయ సహాయం అందించింది. ఎంపానెల్డ్ న్యాయవాదుల జాబితాను ఇచ్చి లాయర్ను ఎంచుకోవాలని సూచించింది. అనంతరం డెత్ వారెంట్ల పిటిషన్లపై విచారణను గురువారానికి వాయిదా వేసింది.
దీంతో తీవ్ర నిరుత్సాహానికి గురైన నిర్భయ తల్లి కోర్టు గదిలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘వ్యవస్థపై నాకు నమ్మకం పోతోంది. ఉరితీతను ఆలస్యం చేసేందుకు దోషులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. న్యాయస్థానం వీటిని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు పవన్ గుప్తాకు కొత్త లాయర్ను ఏర్పాటు చేస్తే ఆ న్యాయవాది కేసును ఫైల్ చేయడంలో మరింత ఆలస్యం చేస్తారు. ఓ బాధితురాలి తల్లిని నేను. నా హక్కుల గురించి ఆలోచించరా?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘మీ హక్కుల గురించి మా అందరికీ తెలుసు. దానికి అనుగుణంగానే విచారణలు సాగుతున్నాయి. అయితే ప్రతి దోషికీ తన చివరి శ్వాస వరకు న్యాయ సహాయం పొందే అర్హత ఉంది ’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె