సుప్రీం కోర్టు ఆవరణలో బ్యాగు కలకలం!

దేశ రాజధాని దిల్లీలోని సుప్రీం కోర్టు ఆవరణలో శుక్రవారం ఓ బ్యాగు కలకలం సృష్టించింది. బ్యాగులోని పవర్‌ బ్యాంక్‌ మూలంగా కాసేపు భయాందోళన నెలకొంది. దీంతో భద్రతా.....

Published : 14 Feb 2020 23:20 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని సుప్రీం కోర్టు ఆవరణలో శుక్రవారం ఓ బ్యాగు కలకలం సృష్టించింది. బ్యాగులోని పవర్‌ బ్యాంక్‌ కారణంగా భయాందోళన నెలకొంది. దీంతో భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించిన అనంతరం ప్రమాదమేమీ లేదని తేల్చారు. కోర్టు పనివేళ్లలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని బ్యాగులోంచి బీప్‌ బీప్‌ మంటూ శబ్దం రావడంతో గుర్తించిన భద్రతా సిబ్బంది.. వెంటనే ఎవరూలేని ప్రదేశంలోకి తీసుకెళ్లారు. బ్యాగును క్షుణ్ణంగా తనిఖీ చేశాక అందులో ఓ పవర్‌ బ్యాంక్‌ కారణంగానే ఆ శబ్దం వచ్చిందని తేల్చారు. బ్యాగును కంట్రోల్‌రూమ్‌కు అప్పగించామని భద్రతా సిబ్బంది తెలిపారు. ఈ ఘటన మూలంగా కోర్టు కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని