షాను కలుస్తాం.. షహీన్‌బాగ్‌ నిరసనకారులు

పోలీసుల నుంచి అనుమతి లభించాక కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుస్తామని షహీన్‌బాగ్‌ నిరసనకారులు తెలిపారు. ఆదివారం షా నివాసానికి వెళ్లేందుకు ర్యాలీగా బయల్దేరగా......

Published : 16 Feb 2020 20:14 IST

దిల్లీ: పోలీసుల నుంచి అనుమతి లభించాక కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుస్తామని షహీన్‌బాగ్‌ నిరసనకారులు తెలిపారు. ఆదివారం షా నివాసానికి వెళ్లేందుకు ర్యాలీగా బయల్దేరగా.. అనుమతి లేని కారణంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు తమ నిరసన శిబిరానికి వెనుదిరిగారు. నిరసనకారుల మార్చ్‌ ఉండడంతో అప్పటికే మోహరించిన పోలీసులు బారికేడ్లను అడ్డుగా పెట్టారు. అమిత్‌షాను కలిసేందుకు, ఆయన నివాసం వరకు శాంతియుతంగా మార్చ్‌ నిర్వహించేందుకు అనుమతి కోరామని నిరసనకారులు తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చాక మార్చ్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) నిరసిస్తూ దిల్లీలోని షహీన్‌బాగ్‌లో గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల అమిత్‌షా మాట్లాడుతూ.. సీఏఏపై ఎవరైనా తనతో చర్చించాలనుకుంటే తన కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ నేపథ్యంలో షహీన్‌బాగ్‌ నిరసనకారులు అమిత్‌షా నివాసానికి వెళ్లాలని నిర్ణయించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని