మోదీ సర్ప్రైజ్: మేళాకు వెళ్లి ఛాయ్ తాగి
ఎంతో బిజీగా ఉండే ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన షెడ్యూల్ నుంచి కాస్తంత విరామం తీసుకున్నారు. దిల్లీలోని రాజ్పథ్లో జరుగుతున్న ‘హునర్ హాట్’ మేళాకు వెళ్లి కాసేపు సరదాగా గడిపారు. అక్కడి దుకాణదారులతో
దిల్లీ: ఎంతో బిజీగా ఉండే ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన షెడ్యూల్ నుంచి కాస్తంత విరామం తీసుకున్నారు. దిల్లీలోని రాజ్పథ్లో జరుగుతున్న ‘హునర్ హాట్’ మేళాకు వెళ్లి కాసేపు సరదాగా గడిపారు. అక్కడి దుకాణదారులతో ముచ్చటించారు. ఉత్తరాది ప్రముఖ స్నాక్ లిటి చోఖా తిని మట్టి కప్పులో ఛాయ్ తాగారు.
ఈ మధ్యాహ్నం కేంద్ర కేబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత మోదీ అక్కడి నుంచి నేరుగా మేళాకు వెళ్లారు. ప్రధాని రాక గురించి ఎవరికీ ముందస్తు సమాచారం లేదు. దీంతో మోదీని చూడగానే అక్కడి అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు మోదీ మేళాను సందర్శించారు. వివిధ స్టాల్స్ తిరుగుతూ అక్కడి వస్తువులు, కళా ప్రదర్శనల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రదర్శనలోని సంగీత పరికరాలను వాయించారు.
ఒక చిరుతిళ్ల దుకాణంలో లిటి చోఖా తిని రూ. 120 చెల్లించారు. మరో దుకాణంలో కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీతో కలిసి కుల్హద్ ఛాయ్(మట్టి కప్పులో ఇచ్చే ఛాయ్) తాగి రూ. 40 చెల్లించారు. మోదీని చూడగానే దుకాణదారులు, సందర్శకులు తెగ సంబరపడిపోయారు. ప్రధానితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!