ట్రంప్ బీస్ట్.. భద్రతలో బెస్ట్
తొలిసారిగా భారత్లో అడుగుపెడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనలో విశేషాలెన్నో.. ఈ పర్యటన కోసం భారీ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేదికలు అంగరంగవైభవంగా ముస్తాబవుతున్నాయి
అమెరికా అధ్యక్షుడి కారు ప్రత్యేకతలెన్నో..
ఇంటర్నెట్డెస్క్: తొలిసారిగా భారత్లో అడుగుపెడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనలో విశేషాలెన్నో.. ఈ పర్యటన కోసం భారీ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేదికలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. అటు భారత్లో ట్రంప్ ప్రయాణించేందుకు ఆయన వాహనశ్రేణి కూడా ఇప్పటికే గుజరాత్ చేరుకుంది. కాగా.. ఇందులో ట్రంప్ కూర్చునే ‘ది బీస్ట్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన, సురక్షితమైన కారు. ట్రంప్ పర్యటన సందర్భంగా బీస్ట్ విశేషాలు ఓసారి చూద్దాం..
అధ్యక్షుడి వెంటే..
అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే కారే ‘ది బీస్ట్’. దీన్ని కాడిలాక్ వన్, ఫస్ట్ కార్ అని కూడా పిలుస్తుంటారు. 1963లో అప్పటి అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య తర్వాత అధ్యక్షుడి కారును మరింత భద్రంగా తీర్చిదిద్దాలని అమెరికా ప్రభుత్వం భావించింది. ఇందుకోసం భారీగానే వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ వినియోగిస్తున్న సరికొత్త కాడిలాక్ మోడల్ను 2018 సెప్టెంబరు 24న కాన్వాయ్లోకి ప్రవేశపెట్టారు. అత్యంత అధునాతన ఫీచర్లతో, భారీ భద్రతా ప్రమాణాలతో ఈ కారును తయారుచేశారు. అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా బీస్ట్ కూడా అక్కడ అడుగుపెట్టాల్సిందే.
అదిరిపోయే ఫీచర్లు..
* ఈ కారు అద్దాలు ఐదు అంగుళాల మందంతో, డోర్లు 8 అంగుళాల మందంతో ఉంటాయి. గాజు, పాలీకార్బొనేట్తో ఐదు లేయర్లలో అద్దాలను తయారు చేశారు. కేవలం డ్రైవర్ విండోను మాత్రం 3 అంగుళాల మేర తెరుచుకుంటుంది. మిగతా అద్దాలేవీ తెరుచుకోవు. కారు అద్దాలన్నీ పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కలిగినవి. రసాయన దాడులను కూడా ఇవి తట్టుకుంటాయి.
* టైర్లు కూడా అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేశారు. ఇవి పగిలిపోవు.. పంక్చర్ కావు. ఒకవేళ డ్యామేజ్ అయినా లోపల ఉండే స్టీల్ రీమ్లతో ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది.
* స్టీల్, అల్యూమినియం, టైటానియం, సిరామిక్తో తయారు చేసిన ఈ కారు బాంబులను కూడా తట్టుకుంటుంది.
* కారు ముందు భాగంలో టియర్ గ్యాస్ గ్రనేడ్ లాంఛర్లు, నైట్ విజన్ కెమెరాలుంటాయి. కారును ఎవరైనా ఆపేందుకు ప్రయత్నిస్తే వెంటనే బాష్పవాయువు ప్రయోగించొచ్చు. ఇక నైట్ విజన్ కెమెరాల ద్వారా రాత్రి పూట కూడా స్పష్టంగా కన్పిస్తుంది. వెనుక భాగంలో ఫైర్ఫైటింగ్ వ్యవస్థ, పొగను తొలగించే స్క్రీన్ డిస్పెన్సర్లు ఉన్నాయి.
* డ్రైవర్ క్యాబిన్లో సరైన కమ్యూనికేషన్, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది. అంటే కారు ఎక్కడకు వెళ్లినా ఇట్టే పసిగట్టే వీలుంటుంది. ఇక సాదాసీదా డ్రైవర్లు దీన్ని నడపడం కుదరదు. బీస్ట్ డ్రైవర్కు యూఎస్ సీక్రెట్ సర్వీస్తో ముందుగానే శిక్షణ ఇస్తారు. అత్యవసర సమయాల్లో అధ్యక్షుడిని ఎలా కాపాడాలనే దానిపై ట్రైనింగ్ ఇస్తారు. ప్రతి రోజు డ్రైవర్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. క్లిష్టపరిస్థితుల్లో 180 డిగ్రీల ‘జె టర్న్’తో కారును తప్పించేలా డ్రైవర్కు శిక్షణ ఇస్తారు.
* వెనుక భాగంలో అధ్యక్షుడితో పాటు మరో నలుగురు కూర్చోవచ్చు. లోపలి భాగం గాజుతో వేరుచేసి ఉంటుంది. దీన్ని అధ్యక్షుడు మాత్రమే కిందికి దించే వీలుంది. అధ్యక్షుడి కుర్చీ వద్ద శాటిలైట్ ఫోన్ ఉంటుంది. దీని ద్వారా నేరుగా ఉపాధ్యక్షుడు, పెంటగాన్కు ఫోన్ చేసి మాట్లాడొచ్చు.
* అత్యవసర సమయాల్లో అవసరమయ్యే పానిక్ బటన్తో పాటు ఆక్సిజన్ సరఫరా కూడా ఉంది. అధ్యక్షుడి బ్లడ్గ్రూప్ సంబంధించిన బ్లడ్ బ్లాగ్లు కూడా అందుబాటులో ఉంటాయి.
* ఇంధన ట్యాంక్ను కూడా అధునాతనంగా తీర్చిదిద్దారు. ఏదైనా ఢీకొట్టిన ఈ ట్యాంక్ పేలదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!