కరోనా ఎఫెక్ట్: మాస్కుతోనే తొలిముద్దు..!
అయితే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో వాలంటైన్స్ డే అనంతరం సామూహిక వివాహాలు జరగడం ఆనవాయితిగా వస్తోంది. దీనిలో భాగంగా బాకోలోడ్ పట్టణంలో సామూహిక వివాహ కార్యక్రమం చేపట్టింది స్థానిక ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో ద్వారా దాదాపు 220జంటలు ఒక్కటయ్యాయి.
ఫిలిప్పైన్స్లో మాస్కులు ధరించి ఒక్కటైన జంటలు
మనీలా: చైనాలో 2వేలకు పైగా ప్రజలను బలిగొన్న కరోనా వైరస్ వేల సంఖ్యలో బాధితులకు వణుకు పుట్టిస్తోంది. చైనాలో తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా మరో 26 దేశాల్లో విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో చైనాతో పాటు చాలా ప్రాంతాల్లో అనేక శుభకార్యాలు రద్దు చేసుకున్నారు ప్రజలు. ఫిలిప్పైన్స్లో కూడా పదుల సంఖ్యలో కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
అయితే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో వాలంటైన్స్ డే అనంతరం సామూహిక వివాహాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా బాకోలోడ్ పట్టణంలో సామూహిక వివాహ కార్యక్రమం చేపట్టింది స్థానిక ప్రభుత్వం. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 220జంటలు ఒక్కటయ్యాయి. నూతన దంపతులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులతో ఆ వేడుక జరిగే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తెల్లని వస్త్రాలు ధరించిన నూతన వధూవరులతో ఆ ప్రదేశం శ్వేతమయం అయ్యింది. ఇదంతా బాగానే ఉంది కానీ, వారి ముఖాలకు నీలి రంగు మాస్కులు కట్టుకోవడంతో అక్కడ కొత్త వాతావరణం ఏర్పడింది. ఇలా ధరించిన మాస్కులతోనే వివాహం చేసుకున్న నూతన దంపతులు, వారి మొదటి చుంబనంతో భాగస్వామిపై ప్రేమను వ్యక్తం చేయడం అందర్నీ ఆకర్షించింది. వివాహ జీవితాన్ని ఇలా జాగ్రత్త పాటిస్తూ ఆరంభించడం సంతోషంగా ఉందన్నారు. మాస్కుతో ముద్దు పెట్టుకోవడం వింత అనుభూతినిచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు కొందరు నూతన దంపతులు.
వివిధ దేశాల నుంచి ప్రయాణం చేసి వచ్చిన వారిని నిశితంగా పరిశీలించి 14 రోజుల గడువు అనంతరం మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతిచ్చామన్నారు నిర్వాహకులు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దీనిలో పాల్గొనే ప్రతిఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని సూచించారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మాస్కులు అందించిన అధికారులు తమ పట్టణం ఆరోగ్యంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ పట్టణంలో 2013 సంవత్సరంలో దాదాపు 2013 జంటలు ఒక్కటై రికార్డు సృష్టించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్