చైనాకు బిల్గేట్స్, జాక్మా భారీ విరాళం..!
బీజింగ్: కరోనాతో అతలాకుతలమవుతున్న చైనాకు సాయం అందించేందుకు ఇప్పటికే పలు దేశాలు ముందుకొచ్చాయి. ప్రపంచ కుబేరులు కూడా చైనాకు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వస్తున్నారు.
కరోనాను ఎదుర్కొనేందుకు టెక్ కంపెనీల సాయం
బీజింగ్: కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న చైనాకు సాయం అందించేందుకు ఇప్పటికే పలు దేశాలు ముందుకొచ్చాయి. ప్రపంచ కుబేరులు కూడా చైనాకు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో ప్రపంచ సంపన్నులైన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్మా చేరారు. బిల్ గేట్స్ తన ‘బిల్ అండ్ మిలిందా గేట్స్’ ఫౌండేషన్ తరపున దాదాపు 100మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇక చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా కూడా భారీ విరాళాన్ని ప్రకటించింది. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు దాదాపు 14.5 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తామని వెల్లడించింది. వైరస్ను గుర్తించడం, బాధిత ప్రజలకు చికిత్స అందించడంతో పాటు వాక్సిన్ అభివృద్ధికి ఈ విరాళం సహాయపడుతుందన్నారు. అయితే గత జనవరిలో ప్రకటించిన 10మిలియన్ డాలర్లతో కలుపుకొని ఈ మొత్తాన్ని ప్రకటిస్తున్నట్లు జాక్మా పేర్కొన్నారు.
అంతేకాకుండా ఆలీబాబా గ్రూప్ కంపెనీ దాదాపు 145 మిలియన్ డాలర్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. దీనితో పాటు పరిశోధనలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిస్తామని తెలిపింది. వీరిద్దరే కాకుండా, చైనాలో ప్రముఖ టెక్నాలజీ కంపెనీగా ఉన్న టెన్సెంట్(వీచాట్ మాతృసంస్థ)కూడా 42మిలియన్ డాలర్ల సహాయాన్ని అందిస్తామని ప్రకటించింది. మరో సంస్థ కెరింగ్ గ్రూప్ కూడా భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ నిధులను హుబే ప్రావిన్సులోని రెడ్క్రాస్ ఫౌండేషన్ ద్వారా ఖర్చుచేయనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!