సీఏఏపై భయం అవసరం లేదు: ఉద్ధవ్
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. దేశవ్యాప్త..........
దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. దేశవ్యాప్త పౌర పట్టిక (ఎన్ఆర్సీ) చేపట్టబోమని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. తన తనయుడు ఆదిత్య ఠాక్రేతో కలిసి ప్రధాని మోదీని ఉద్ధవ్ శుక్రవారం కలిశారు. ఎన్డీయే నుంచి బయటికొచ్చిన తర్వాత ప్రధాని మోదీతో ఉద్ధవ్ తొలిసారి భేటీ కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమైన సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ వంటి అంశాలపై చర్చించామని భేటీ అనంతరం ఉద్ధవ్ మీడియాతో చెప్పారు.
‘‘సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ గురించి మోదీతో చర్చించాం. ఇప్పటికే వీటిపై నా వైఖరి ఏంటో చెప్పాను. సీఏఏ గురించి భయపడాల్సిన అవసరం లేదు. దీని వల్ల మైనారిటీలు లబ్ధి పొందుతారు. దేశవ్యాప్త ఎన్ఆర్సీ నిర్వహించబోమని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఎన్పీఆర్ వల్ల దేశం నుంచి ఎవరినీ పంపించడం జరగదు’’ అని ఉద్ధవ్ అన్నారు. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా అఘాడీ’ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పాలనను పూర్తి చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలూ లేవని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారని ఉద్ధవ్ తెలిపారు. దిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా, భాజపా సీనియర్ నేత అడ్వాణీతో సైతం ఉద్ధవ్ భేటీ కానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం