చైనా విద్యార్థులకు ద్వారాలుతెరిచిన ఆస్ట్రేలియా..!
గత మూడు నెలలుగా కరోనా వైరస్తో సతమతమవుతోన్న చైనా విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఆస్ట్రేలియా. కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో ఆస్ట్రేలియాలో చదువుకునే చైనీయులను తమ దేశంలోకి రాకుంగా గతనెలలో ప్రకటించిన తాత్కాలిక నిషేధాన్ని సడలిస్తున్నట్లు పేర్కొంది.
విద్యార్థులను అనుమతిస్తూ తాజా నిర్ణయం..!
మెల్బోర్న్: గత మూడు నెలలుగా కరోనా వైరస్తో సతమతమవుతోన్న చైనా విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఆస్ట్రేలియా. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో చదువుకునే చైనీయులను తమ దేశంలోకి రాకుండా గతనెలలో ప్రకటించిన తాత్కాలిక నిషేధాన్ని సడలిస్తున్నట్లు పేర్కొంది.
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చదువుకునే చైనా విద్యార్థుల సంఖ్య భారీగానే ఉంటుంది. దాదాపు 40శాతం చైనా విద్యార్థులు ఉండటం విశేషం. ఇది ఆస్ట్రేలియా ఆర్థికవ్యవస్థకు ఎంతో దోహదం చేస్తోంది. అయితే తమ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకంగా ఉండే విద్యార్థుల చదువు కొనసాగించేందుకు తిరిగి ద్వారాలు తెరుస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. వేసవి సెలవులు ఉండడంతో కొందరు విద్యార్థులు తమ సొంత దేశాలకు వెళ్లిపోయారు. అనంతరం తిరిగి వచ్చే సమయంలోనే కరోనా విజృంభించడంతో చైనా విద్యార్థులపై ఆస్ట్రేలియా నిషేధం విధించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న హుబే ప్రావిన్సు కాకుండా మిగతా ప్రాంతాలకు చెందిన వారిని తిరిగివచ్చేందుకు అనుమతినిచ్చింది.
అయితే తాజా నిర్ణయం ఎంతో మంది ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపశమనం లభించనుంది. ఇలా వచ్చిన వారిని 14రోజుల పాటు ప్రత్యేకంగా ఉంచిన తరువాతే వారిని అనుమతిస్తామని ఆస్ట్రేలియా అధికారులు ప్రకటించారు. అంతర్జాతీయ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చే భాగంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అక్కడి విద్యాశాఖ మంత్రి మీడియాకు తెలిపారు. మిగతా విద్యార్థులపై మరో వారంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అయితే పర్యాటకులపై మాత్రం ఈ నిషేధం కొనసాగుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్లో షేర్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా