‘ట్రంపేమైనా రాముడా..ఎందుకంత ఖర్చు’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనపై కాంగ్రెస్ లోక్సభాపక్షనేత అధిర్ రంజన్ చౌధురి పలు విమర్శలు గుప్పించారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారం కోసం భారత గడ్డకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు..........
మోదీని ప్రశ్నించిన అధిర్ రంజన్
ముర్షీదాబాద్(పశ్చిమబంగాల్): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనపై కాంగ్రెస్ లోక్సభాపక్షనేత అధిర్ రంజన్ చౌధురి పలు విమర్శలు గుప్పించారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారం కోసం భారత గడ్డను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఈ పర్యటన వల్ల భారత్కు ఏం ప్రయోజనం కలుగుతుందన్న దానిపై ఎవరికీ స్పష్టత లేదన్నారు. కేవలం ట్రంప్ని సంతోషపరచడం కోసమే ప్రధాని మోదీ కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు రాముడేమీ కాదని.. ఆయన కోసం అంత వెచ్చించడం దేనికని ప్రశ్నించారు. అమెరికాలో అనేక మంది గుజరాతీలు స్థిరపడ్డారని.. వారి ఓట్లను ఆకర్షించడానికే ట్రంప్ ఈ పర్యటన చేపట్టారని ఆరోపించారు. గతంలో వచ్చిన అధ్యక్షులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని కలిసేవారని.. ఈ సారి అలాంటి ఏర్పాట్లేమీ లేకపోవడాన్ని తప్పుబట్టారు.
ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవ్వబోయే విందుకు పలువురు నాయకుల్ని ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనికి అధిర్ రంజన్ చౌధురికి కూడా ఆహ్వానం అందింది. అయితే దీనికి తాను హాజరు కాబోనని అధిర్ రంజన్ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఆహ్వానించకపోవడమే అందుకు కారణమన్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ట్రంప్ నేడు భారత్కు రానున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు సతీమణి మెలనియా, కూతరు-అల్లుడు ఇవాంకా ట్రంప్, జేర్డ్ కుష్నర్ సహా పలువురు ఉన్నతాధికారులు పర్యటన బృందంలో ఉన్నారు. నేడు ఉదయం 11.40గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరకోనున్న ట్రంప్ రేపు రాత్రి 10 గంటలకు తిరుగుపయనమవుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.